సైన్యాన్ని స్వయం శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరంగా శ్రమిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వీర జవాన్లకు ఆయన ఘనంగా నివాళి అర్పించారు. ‘నేషనల్ వార్ మెమోరియల్’ను జాతికి అంకితం చేశారు. ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలో నిర్మించిన ఈ జాతీయ యుద్ధ స్మారకాన్ని సోమవారం (ఫిబ్రవరి 25) సాయంత్రం ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం మాజీ సైనిక ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.
‘పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు ఈ చారిత్రక ప్రదేశంలో నివాళి అర్పిస్తున్నా. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేస్తున్న అమరవీరులందరికీ ఇదే నా నివాళి’ అని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు కుటుంబ పాలనపైనే దృష్టి సారిస్తే.. తాము అమర జవాన్ల కుటుంబాల గురించి ఆలోచించామని మోదీ అన్నారు.
సైనిక బలగాలకు 1,86,000 బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు కావాలని 2009లో డిమాండ్ వచ్చిందని.. 2009 నుంచి 2014 వరకు ప్రభుత్వం ఆ డిమాండ్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మోదీ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సైనిక దళాలకు 2 లక్షల 30 వేల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందజేశామని చెప్పారు.
గత ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శలు కురిపించారు. వార్ మెమోరియల్ను నిర్మించాలనేది దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్ అని ఆయన గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవి దీన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 2014లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వార్ మెమోరియల్ నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగిందన్నారు.
‘గతంలో నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడేవారు. కానీ, ఇప్పుడు అవన్నీ సాధ్యమవుతున్నాయి. దేశ భద్రత విషయంలో అందరి సహకారం అవసరం. ఈ సరికొత్త విధానాల కారణంగానే వైమానిక దళంలోకి తొలిసారి మహిళా పైలట్లు అడుగుపెట్టారు. సాయుధ బలగాల్లోకి మహిళలను తీసుకోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం’ అని మోదీ చెప్పారు.
బోఫోర్స్ నుంచి ఆగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ డీల్ వరకు.. అన్ని స్కాముల్లోనూ ఒకే కుటుంబం హస్తం ఉందని, ఇప్పుడు వాళ్లే రఫేల్ యుద్ధ విమానాన్ని దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని మోదీ ఆరోపించారు.
‘పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు ఈ చారిత్రక ప్రదేశంలో నివాళి అర్పిస్తున్నా. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేస్తున్న అమరవీరులందరికీ ఇదే నా నివాళి’ అని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు కుటుంబ పాలనపైనే దృష్టి సారిస్తే.. తాము అమర జవాన్ల కుటుంబాల గురించి ఆలోచించామని మోదీ అన్నారు.
సైనిక బలగాలకు 1,86,000 బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు కావాలని 2009లో డిమాండ్ వచ్చిందని.. 2009 నుంచి 2014 వరకు ప్రభుత్వం ఆ డిమాండ్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మోదీ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సైనిక దళాలకు 2 లక్షల 30 వేల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందజేశామని చెప్పారు.
గత ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శలు కురిపించారు. వార్ మెమోరియల్ను నిర్మించాలనేది దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్ అని ఆయన గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవి దీన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 2014లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వార్ మెమోరియల్ నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగిందన్నారు.
‘గతంలో నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడేవారు. కానీ, ఇప్పుడు అవన్నీ సాధ్యమవుతున్నాయి. దేశ భద్రత విషయంలో అందరి సహకారం అవసరం. ఈ సరికొత్త విధానాల కారణంగానే వైమానిక దళంలోకి తొలిసారి మహిళా పైలట్లు అడుగుపెట్టారు. సాయుధ బలగాల్లోకి మహిళలను తీసుకోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం’ అని మోదీ చెప్పారు.
బోఫోర్స్ నుంచి ఆగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ డీల్ వరకు.. అన్ని స్కాముల్లోనూ ఒకే కుటుంబం హస్తం ఉందని, ఇప్పుడు వాళ్లే రఫేల్ యుద్ధ విమానాన్ని దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని మోదీ ఆరోపించారు.