యాప్నగరం

జవానుల వల్లే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం

భోపాల్‌లో జరిగిన మాజీ ఆర్మీ ఉద్యోగుల బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.

TNN 14 Oct 2016, 5:59 pm
సరిహద్దుల్లో సైనికులు చేసే త్యాగాల వల్లే మనమంతా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రజల రక్షణ కోసం, దేశం కోసం సైనికులు ప్రాణాలు పణంగా పెడుతున్నారని కొనియాడారు. ఆయన శుక్రవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు విచ్చేశారు. ఇక్కడ జరిగిన మాజీ ఆర్మీ ఉద్యోగుల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ‘శౌర్య స్మారక్’ స్మృతిని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఆర్మీ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్ఫీఎఫ్, కోస్టల్ గార్డులు... వీరంతా చేసే త్యాగాల వల్లే మనమంతా హాయిగా నిద్రపోగలుగుతున్నామని అన్నారు. ఓసారి యెమెన్ లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఆర్మీ వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పాకీస్థానీలను కూడా ఇండియన్ ఆర్మీ కాపాడిందని గుర్తు చేశారు. మన భారత ఆర్మీ మానవత్వానికి అదే పెద్ద ఉదాహరణ అని తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతి దళాల్లో భారత్ ఎప్పటి నుంచో భాగస్వామిగా ఉందన్నారు. మన సైనికుల బలం ఆయుధాలు కాదని... 120 కోట్ల ప్రజల మనోశక్తే వారి బలమని అన్నారు.
Samayam Telugu pm modi inaugurates war memorial in bhopal
జవానుల వల్లే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం


మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా సభలో మాట్లాడారు. అధికారం చేపట్టిన రెండేళ్లలో ప్రధాని మోడీ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.