యాప్నగరం

పేదింటికి విద్యుత్ వెలుగులు.. ‘సౌభాగ్య’ పథకం ప్రారంభం

పేదల సంక్షేమం దిశగా ప్రధాని మోదీ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 25) సాయంత్రం ఆయన ‘ప్రధానమంత్రి సహజ్‌ బిజ్లీ హర్‌ఘర్‌ యోజన’ (సౌభాగ్య) పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పేదింటికీ విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఈ ఏడాది డిసెంబరు నాటికి..

TNN 7 Dec 2022, 1:13 pm
పేదల సంక్షేమం దిశగా ప్రధాని మోదీ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 25) సాయంత్రం ఆయన ‘ప్రధానమంత్రి సహజ్‌ బిజ్లీ హర్‌ ఘర్‌ యోజన’ (సౌభాగ్య) పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పేదింటికీ విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఈ ఏడాది డిసెంబరు నాటికి అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు అందించనున్నారు. దీనికి రూ. 16,320 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు రూ. 14,025 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ. 2,295 కోట్లు కేటాయించారు.
Samayam Telugu Subhagya


2019 మార్చి 31 నాటికి ఈ పథకం కింద ప్రతి ఇంటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు రూపొందించారు. పథకం అమలుకు కేంద్రం 60 శాతం గ్రాంటు ఇవ్వనుండగా.. రాష్ట్రాలు 10 శాతం భరించనున్నాయి. మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చనున్నారు.

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ పథకం కోసం 85 శాతం నిధులను కేంద్రం గ్రాంటు రూపంలో ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం భరించనుంది. మొత్తం మీద ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12,320 కోట్లు భరించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.