దేశ రాజధాని కొత్త ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అత్యాధునిక హైటెక్నాలజీ హంగులతో కొత్త ప్రధాన కార్యాలయం సిద్ధకాబోతోంది. ఈ కార్యాలయ భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గంలో ఈ ప్రధాన కార్యాలయాన్ని మొత్తం 8 వేల చదరపు మీటర్లలో నిర్మిస్తున్నారు. ఇందులో 70 వరకు సర్వ హంగులతో కూడిన గదులుంటాయి. భవన విస్తీర్ణంలో 70 శాతం వరకు పచ్చదనానికి ప్రాథాన్యతనిస్తున్నారు.
ఢిల్లీలో హైటెక్ బీజేపీ కార్యాలయం
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.
Samayam Telugu 18 Aug 2016, 5:01 pm