యాప్నగరం

ముంబైలో రెండో విమానాశ్రయం.. మోదీ శంకుస్థాపన

ముంబైవాసుల 21 ఏళ్ల నిరీక్షణకు తొలి అడుగు పడింది. నవీ ముంబైలో ప్రధాని మోదీ నూతన అంతర్జాతీయ వియానాశ్రయానికి ఆదివారం (ఫిబ్రవరి 18) శంకుస్థాపన చేశారు.

TNN 18 Feb 2018, 7:57 pm
ముంబైవాసుల 21 ఏళ్ల నిరీక్షణకు తొలి అడుగు పడింది. నవీ ముంబైలో ప్రధాని మోదీ నూతన అంతర్జాతీయ వియానాశ్రయానికి ఆదివారం (ఫిబ్రవరి 18) శంకుస్థాపన చేశారు. రూ. 16,700 కోట్ల వ్యయంతో చేపడుతోన్న ఈ వియానాశ్రయం పూర్తయితే.. దేశ ఆర్థిక రాజధాని కీర్తి కిరీటంలో మరో మకుటం చేరినట్లే. ప్రస్తుతం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోన్న జీవీకే గ్రూప్‌, సిడ్కో సంస్థ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నారు.
Samayam Telugu pm modi lays foundation stone for navi mumbai international airport
ముంబైలో రెండో విమానాశ్రయం.. మోదీ శంకుస్థాపన


4 విడతలుగా చేపడుతోన్న ఈ ప్రాజెక్టును 2031 నాటికి 6 కోట్ల మంది ప్రయాణించేలా అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. మొదటి విడతలో భాగంగా 2019 డిసెంబరు నాటికి కోటి మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఒక రన్‌వే, విమానాశ్రయ భవనం నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు.

ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ఏటా పెరుగుతోన్న రద్దీ దృష్ట్యా మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని వాజ్‌పాయ్ హయాంలోనే కసరత్తు ప్రారంభించారు. 1997లో రూ.3000 కోట్ల అంచనాతో ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌ ట్రాఫిక్‌లో 25 శాతం మేర ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఒకే రన్‌వేతో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ విమానాశ్రయంలో సగటున రోజుకు 980 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నూతనంగా నిర్మించతలపెట్టిన విమానాశ్రయంలో సమాంతర రన్‌వేలతో గంటకు 80 విమానాలు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ కంటైనర్‌ టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. ఇది దేశంలో నాలుగో కంటైనర్ టెర్మినల్ కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.