యాప్నగరం

నా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోండి.. కరుణతో మోదీ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు.

TNN 6 Nov 2017, 1:34 pm
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. సోమవారం మధ్యాహ్నం గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లిన మోదీ.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని ఈ సందర్భంగా కరుణానిధిని మోదీ కోరారు. ఆ తరవాత కరుణానిధి భార్య దయాలు అమ్మాల్‌తో కూడా మోదీ మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Samayam Telugu pm modi meets dmk chief m karunanidhi at his residence
నా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోండి.. కరుణతో మోదీ


అంతకుముందు.. తన తండ్రిని కలుసుకునేందుకు స్వయంగా ఇంటికి వచ్చిన ప్రధాని మోదీకి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి ఇంట్లోకి ఆహ్వానించారు. మోదీ వెంట తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు సౌందరరాజన్, ఇతర బీజేపీ నేతలు ఉన్నారు.

కాగా, తమిళ దినపత్రిక ‘డైలీ తంతి’ 75వ వార్షికోత్సవ వేడుకల్లో (ప్లాటినం జూబ్లీ) పాల్గొనడానికి నరేంద్ర మోదీ సోమవారం చెన్నై వచ్చారు. ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో మోదీ భేటీ అయ్యారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌కు చేరుకుని అక్కడ సెంటినరీ హాల్‌లో ఏర్పాటుచేసిన ‘డైలీ తంతి’ 75వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.