నాడు 'చాయ్ పే చర్చా'... నేడు 'లంచ్ పే చర్చా'..!
గత ఎన్నికల్లో 'చాయ్ పే చర్చా' కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో
TNN 10 Feb 2018, 3:39 pm
గత ఎన్నికల్లో 'చాయ్ పే చర్చా' కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి 'లంచ్ పే చర్చా' కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిశాక.. శుక్రవారం (ఫిబ్రవరి 9న) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ.. గ్రామాలు, పట్టణాల్లో 'లంచ్ పే చర్చా' కార్యక్రమాలు చేపట్టి కేంద్ర బడ్జెట్లోని ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ ఎంపీలను కోరారు. ఎంపీల ప్రచారం మీదే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం ఆధారపడి ఉందన్నారు.
ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను మరింత ప్రభావమంతంగా తీసుకెళ్లాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలతో మమేకమవ్వాలని, బడ్జెట్లోని అంశాలపై వారికి అవగాహన కల్పించాలని పార్టీ ఎంపీలను కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రధానంగా రైతులు, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ఉందని.. ప్రతిపక్షాలు చేస్తున్న బడ్జెట్ వ్యతిరేక విమర్శలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ 'లంచ్ పే చర్చా' కార్యక్రమం గురించి వివరిస్తూ... గతేడాది 'వారణాసిలో లంచ్ సమయంలో నేను ప్రజలు, పార్టీ కార్యకర్తలతో వివిధ అంశాలపై చర్చించాను. అక్కడికి నా టిఫిన్ బాక్స్ నేనే తెచ్చుకున్నాను. కాబట్టి మీరు కూడా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన సమయంలో సమావేశాలు నిర్వహించాలి. మీ భోజనం మీరే తీసుకెళ్లాలని సూచించారు. ఇదంతా కూడా సహజంగా జరిగేలా ఉండాలి కానీ.. మనమేదో భోజనం పెట్టి పథకాల గురించి ప్రచారం చేసినట్లుండకూడదు’ అని వివరించారు.
ఈ సందర్భంగా గతనెలలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను ఎంపీలకు అందజేశారు.
ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను మరింత ప్రభావమంతంగా తీసుకెళ్లాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలతో మమేకమవ్వాలని, బడ్జెట్లోని అంశాలపై వారికి అవగాహన కల్పించాలని పార్టీ ఎంపీలను కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రధానంగా రైతులు, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ఉందని.. ప్రతిపక్షాలు చేస్తున్న బడ్జెట్ వ్యతిరేక విమర్శలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ 'లంచ్ పే చర్చా' కార్యక్రమం గురించి వివరిస్తూ... గతేడాది 'వారణాసిలో లంచ్ సమయంలో నేను ప్రజలు, పార్టీ కార్యకర్తలతో వివిధ అంశాలపై చర్చించాను. అక్కడికి నా టిఫిన్ బాక్స్ నేనే తెచ్చుకున్నాను. కాబట్టి మీరు కూడా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన సమయంలో సమావేశాలు నిర్వహించాలి. మీ భోజనం మీరే తీసుకెళ్లాలని సూచించారు. ఇదంతా కూడా సహజంగా జరిగేలా ఉండాలి కానీ.. మనమేదో భోజనం పెట్టి పథకాల గురించి ప్రచారం చేసినట్లుండకూడదు’ అని వివరించారు.
ఈ సందర్భంగా గతనెలలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను ఎంపీలకు అందజేశారు.