యాప్నగరం

మొదటి ప్రపంచ యుద్ధ అమరవీరులకు మోదీ నివాళి

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారత వీరులకు నివాళులు అర్పించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని..

TNN 6 Jul 2017, 5:32 pm
ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం (జులై 6).. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారత వీరులకు నివాళులు అర్పించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో కలిసి ఆయన హైఫాలోని అమరవీరుల స్మృతి చిహ్నం ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. భారతీయ సైనికుల సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం.. యుద్ధంలో అమరుడైన మేజర్‌ దల్పాత్‌ సింగ్‌ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఒట్టోమాన్ టర్క్స్ నుంచి హైఫా నగరాన్ని విడిపించడానికి భారత సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ క్రమంలో 44 మంది సైనికులు ప్రాణత్యాగం చేశారు.
Samayam Telugu pm modi pays homage to indian world war i heroes in israel
మొదటి ప్రపంచ యుద్ధ అమరవీరులకు మోదీ నివాళి


ఆ తర్వాత ఇరు దేశాల ప్రధానులు హైఫాలోని డోర్‌ బీచ్‌కు వెళ్లారు. సముద్రపు నీటిలోకి దిగి నడుచుకుంటూ కాసేపు ముచ్చటించారు. నేటితో భారత ప్రధాని 3 రోజుల ఇజ్రాయెల్‌ పర్యటన ముగిసింది. అనంతరం ఆయన జర్మనీ వెళ్లనున్నారు. జులై 7, 8 తేదీల్లో జర్మనీలో జరిగే జీ-20 సదస్సులో మోదీ పాల్గొంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.