యాప్నగరం

కొడుకు, డబ్బు, కుటుంబం... ఇవే ఆ పార్టీలకు ముఖ్యం

బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రతిపక్షాలనుద్దేశించి ఘాటుగా విమర్శించారు.

TNN 2 Jan 2017, 4:07 pm
యూపీలోని లక్నోలో జరుగుతున్న బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రతిపక్షాలనుద్దేశించి ఘాటుగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల్లో నెలకొని ఉన్న అంతర్గత కుమ్ములాటలు, కేసులు... అన్నింటినీ అస్త్రాలుగా చేసుకుని ప్రసంగించారు. ఒక పార్టీ (ఎస్పీ) కుటుంబపరంగా, రాజకీయంగానూ విడిపోయిందన్నారు. మరో పార్టీ (బీఎస్పీ) తమ నేతలపై వచ్చిన బ్లాక్ మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతోందన్నారు. ఇక ఇంకో పార్టీ(కాంగ్రెస్) ని ముందుకు నడిపించే ఒక బలమైన నాయకుడు లేక దిశానిర్దేశం లేకుండా ఉందన్నారు. ఏ పార్టీ పేరును ఆయన ప్రస్తావించలేదు. త్వరలో రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేది బీజేపీయేనని అన్నారు.
Samayam Telugu pm modi slams congress bsp and sp in uttar pradesh rally
కొడుకు, డబ్బు, కుటుంబం... ఇవే ఆ పార్టీలకు ముఖ్యం


ప్రజలే తమ హైకమాండ్, ఇంకే హై కమాండ్ లేదని అన్నారు. యూపీలో చాలా మంది అమాయక ప్రజలు గూండాల వల్ల, ఈవ్ టీజర్స్ వల్ల, దౌర్జన్యాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీజేపీకి అవకాశమిస్తే ఆ దౌర్జన్యాలకు చెక్ పెడతామని అన్నారు. బీజేపీ చేపట్టిన పరివర్తన్ ర్యాలీకి ఇంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తమను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.