యాప్నగరం

యూపీని రక్షించగలిగేది బీజేపీ మాత్రమే!

అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో ఓటేయాలని ప్రధానమంత్రి మోడీ యూపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

TNN 2 Jan 2017, 3:20 pm
కులాలు, మతాలు పక్కన పెట్టి... అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో ఓటేయాలని ప్రధానమంత్రి మోడీ యూపీ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. పద్నాలుగేళ్ల పాటూ యూపీ అభివృద్ధికి దూరమైందన్నారు. ఒక పార్టీ తమ కుటుంబ రాజకీయాల కోసం పాకులాడుకుంటుంటే, ఇంకో పార్టీ ధర రాజకీయాల్లో మునిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం యూపీని రక్షించగలిగేది కేవలం బీజేపీ మాత్రమేనని చెప్పారు.
Samayam Telugu pm modi speech at bjp parivartan rally in lucknow
యూపీని రక్షించగలిగేది బీజేపీ మాత్రమే!



మొదటిసారి సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు కలిసి ఒకే నినాదాన్ని అన్నాయని... అది ‘మోడీ హఠావో’ అన్న నినాదమని చెప్పారు. తాను మాత్రం ‘కరప్షన్ హఠావో’ (అవినీతిని తొలగించండి), ‘కాలా ధన్ హఠావో’ (నల్లధనాన్ని తొలగించండి) అన్న నినాదాలు ఇస్తున్నానని చెప్పారు. ఏ నినాదానికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకోవల్సిన ప్రజలేనని ఆయన అన్నారు. యూపీ తలరాతని మార్చే సమయం వచ్చిందన్నారు. భారత్ అభివృద్ధి చెందాలంటే, కచ్చితంగా యూపీ అభివృద్ధి చెందాల్సిందేనని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.