యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

కరోనా వైరస్ విషయమై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించున్నారు. గురువారం రాత్రి కూడా మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 24 Mar 2020, 11:33 am
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ఆయన కరోనా విషయమై దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. గురువారం రాత్రి కూడా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కోవిడ్‌ను కట్టడి చేయడం కోసం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొనాలని కోరారు.
Samayam Telugu modi pm


జనతా కర్ఫ్యూను దేశ ప్రజలంతా విజయవంతం చేశారు. అనంతరం దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్ చేపట్టగా.. ప్రజలు సాధారణ రోజుల్లో బయటకు వచ్చినట్లుగానే రోడ్లెక్కారు. ఈ విషయమై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సందర్భంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు.

దేశంలో కరోనా వైరస్ మూడో దశలోకి ప్రవేశించే అవకాశం ఉందనే ఐసీఎంఆర్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ఆసక్తి రేపుతోంది. గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా... ప్రపంచ యుద్ధాల కంటే కరోనా తీవ్ర సమస్య అని ప్రధాని అభిప్రాయపడ్డారు. కొద్ది రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరం కలిసి కట్టుగా కరోనాను జయిద్దాం అని పిలుపునిచ్చారు.

Read Also: గురువారం నాటి ప్రధాని మోదీ ప్రసంగం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.