యాప్నగరం

నేడు బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌ షో ప్రారంభం.. ప్రత్యేకతలు ఎన్నో

వైమానిక విన్యాసాలు.. ఏరో ఇండియా- 2023 ప్రదర్శనను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి బెంగళూరు చేరుకున్నారు. హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు కర్ణాటక గవర్నర్‌, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. ఏరో ఇండియా ప్రదర్శన నేపథ్యంలో బెంగళూరు- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల సమస్యలూ ఎదురుకాకుండా దారి పొడవునా ప్రత్యేక రక్షణ బలగాలను అందుబాటులో ఉంచారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 13 Feb 2023, 9:09 am

ప్రధానాంశాలు:

  • 14వ సారి ఆతిథ్యం ఇస్తోన్న కర్ణాటక ప్రభుత్వం
  • వైమానిక ప్రదర్శనలో పాల్గొననున్న 98 దేశాలు
  • రూ.75 కోట్ల మేర పెట్టుబడులకు అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Aero show
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు (Aero India 2023) బెంగళూరు సిద్ధమయ్యింది. ‘ది రన్‌వే టూ బిలియన్ ఆపర్చ్యూనిటీస్’ థీమ్‌తో యలహంక వైమానిక కేంద్రంలో జరిగే ఈ ఎయిర్‌షోకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారి ఐదు రోజుల పాటు దీనిని నిర్వహిస్తుండగా.. ఇందుకోసం 35 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటుచేయడం విశేషం. మొత్తం 98 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. అలాగే, 32 దేశాల రక్షణ మంత్రులు, 29 దేశాల వైమానిక దళ చీఫ్‌లు, 73 కంపెనీల సీఈఓలతోనూ సమావేశాలు నిర్వహించున్నారు. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొనడం ఇదే తొలిసారి. వీటిల్లో ఎంఎస్‌ఎంఈ, అంకుర సంస్ధలు ఉన్నాయి.
కాగా, కర్ణాటక రికార్డుస్థాయిలో 14వ సారి వైమానిక ప్రదర్శనకు ఆతిథ్యం ఇస్తోంది. దీంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 2021లో కరోనా వైరస్ వ్యాప్తితో ఫ్రాన్స్‌ సైతం వైమానిక ప్రదర్శనను రద్దు చేసుకుంటే.. వర్చువల్ ద్వారా ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించిన ఘనత కర్ణాటకకే దక్కుతుంది. అదే కేంద్ర రక్షణ శాఖ విశ్వాసాన్ని చూరగొనేలా చేసింది. కోవిడ్-19 తగ్గుముఖం పట్టి ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడుతుంటంతో ప్రపంచ దేశాల రక్షణ సంస్థలు 14వ వైమానిక ప్రదర్శనపై ఆసక్తి చూపాయి.

ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనన్ని రక్షణ, వైమానిక సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీపడలేదు. ఈ ప్రదర్శన కోసం ఒక రోజు ముందుగానే బెంగళూరు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. సోమవారం భారతీయ ఆత్మనిర్భర్‌ సాధనలపై (Make in India) ప్రపంచానికి సందేశం ఇవ్వనున్నారు.

అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు రోజువారీ ప్రదర్శనలో పాల్గొంటాయి. అమెరికా నేవీకి చెందిన అత్యంత అధునాతన బహుళ సాధన యుద్ధ విమానం సూపర్ హర్నెట్ F/A-18E, F/A-18F‌లు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయని అధికారులు తెలిపారు. మొత్తం , రూ.75,000 కోట్ల పెట్టుబడుల కోసం భారత, విదేశీ రక్షణ సంస్థలతో 251 ఒప్పందాలను చేసుకోనున్నారు.

కాగా, గత ఐదేళ్లుగా భారత రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల్లో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వాటినే వినియోగించారు. ఆత్మ నిర్భర్‌ నిధులతో రక్షణ రంగం సాధించిన ప్రగతిని ఈ వేదిక ద్వారా ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.


Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.