యాప్నగరం

వాజ్‌పేయి ఆరోగ్యం విషమం: ఎయిమ్స్‌కు చేరిన ప్రధాని

మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితి బుధవారం విషమించడంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెసెస్ (AIIMS)కు వెళ్లారు.

Samayam Telugu 15 Aug 2018, 8:03 pm
మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితి బుధవారం విషమించడంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెసెస్ (AIIMS) వెళ్లారు. వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని, ఆయనకు వైద్యం అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు.
Samayam Telugu Untitledaaaaల


ఇంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఎయిమ్స్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సదుపాయలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఎయిమ్స్‌కు చేరుకున్నారు.

మూత్ర సంబంధిత సమస్యలతో డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా బాధపడుతున్న వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడంతో జూన్‌ 12న ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరికొద్ది సేపటిలో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

వాజ్‌పేయి ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బీజేపీ పార్టీ తమ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. గురువారం విజయవాడలో జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.