యాప్నగరం

మోదీ సర్‌ప్రైజ్.. ట్రాఫిక్ జామ్ కాకూడదని మెట్రోలో ప్రయాణం

ఢిల్లీ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకూడదంటూ మెట్రోలో ప్రయాణించి సర్‌ప్రైజ్ చేసిన ప్రధాని మోదీ.

Samayam Telugu 20 Sep 2018, 7:26 pm
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఢిల్లీలో ద్వారకలో ఇండియా ఇంటర్నేషన్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌కు శంఖుస్థాపనకు బయల్దేరిన మోదీ.. తన వల్ల ప్రజలు ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోలో ప్రయాణించారు.
Samayam Telugu Koushal1


న్యూఢిల్లీలో మినహా.. ఢిల్లీ చుట్టుపక్క ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వీవీఐపీలు ప్రయాణిస్తే ట్రాఫిక్ మరింత జఠిలమవుతుంది. ద్వారకా సెక్టార్ 25లో మోదీ పాల్గొనే కార్యక్రమ ప్రాంతానికి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వే మెట్రో రైలు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మోదీ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకుండా మెట్రోలో ప్రయాణించడానికే ఆసక్తి చూపారు. సుమారు 18 నిమిషాల వ్యవధిలోనే వేదిక వద్దకు చేరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.