యాప్నగరం

నల్లధనం, అవినీతిపై పోరాటం ఆపం: మోడీ

ప్రధాన మంత్రి మోడీ రాజ్యసభలో నోట్ల రద్దు వ్యవహారంపై ప్రసంగించారు.

TNN 8 Feb 2017, 7:17 pm
ప్రధాన మంత్రి మోడీ రాజ్యసభలో నోట్ల రద్దు వ్యవహారంపై ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన రాజ్యసభలో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు, నల్లధనాన్ని నిరోధించేందుకు నోట్ల రద్దు చేశామని చెప్పారు. ఏ ఒక్క పార్టీనో దృష్టిలో పెట్టుకుని చేసింది కాదన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ అనేక కుంభకోణాలు వెలుగు చూశాయని అన్నారు.
Samayam Telugu pm modis speech on demonitization in rajyasabha
నల్లధనం, అవినీతిపై పోరాటం ఆపం: మోడీ


గతంలో భారత ఆర్ధిక వ్యవస్థపై మన్మోహన్ సింగ్ ప్రభావం బాగానే పడిందని అన్నారు. అయినా ఒక్క మచ్చ కూడా మీద పడకుండా చూసుకున్నారని మన్మోహన్‌ను ఉద్దేశించి అన్నారు. బాత్ రూమ్‌లో కూడా ఆయన రెయిన్ కోట్ వేసుకుంటారని చమత్కరించారు. అంటే కుంభకోణాలు ఎన్ని జరిగినా వాటి మచ్చ తనపై పడకుండా ఆయన కాపాడుకుంటారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రధాని అన్న ఈ మాటలకు కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలియజేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం మోడీ ప్రసంగం సాగింది. పెద్ద నోట్ల రద్దు సత్ఫలితాలను ఇస్తోందని, అవినీతిపై తమ పోరాటం ఆగదని అన్నారు. నల్లధనం భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. నోట్ల రద్దు తరువాత 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మన నోట్ల రద్దు ప్రపంచదేశాలకు ఓ కేస్ స్టడీలా మారిందని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని పలువురు రాజకీయ నేతలు విమర్శించినప్పటికీ ప్రజలు స్వాగతించారని హర్షం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.