యాప్నగరం

రాష్ట్రపతి కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రధాని మోదీ కలిశారు. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు చర్చించారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తలు నెలకొన్న వేళ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Samayam Telugu 5 Jul 2020, 3:30 pm
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఆదివారం (జులై 5) మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌ను ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి ప్రదాని మోదీ వివరించినట్లు తెలుస్తోంది. ‘ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను వివరించారు’ అని ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
Samayam Telugu రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ
Modi Meets Kovind


లడఖ్‌లో చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ.. శుక్రవారం లేహ్‌ పర్యటనకు వెళ్లి దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దులో నిలబడి శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు చేశారు. 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శించారు. వారిలో మరింత ఆత్మస్థైర్యం నింపారు. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళి అర్పించారు.

లేహ్‌లో సైనికాధికారులతో సమావేశమై ప్రధాని ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆయా అంశాలను ప్రధాని మోదీ తాజాగా రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.