యాప్నగరం

కరుణానిధి మృతి తీవ్రంగా బాధించింది: మోదీ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి తనను తీవ్రంగా బాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 7 Aug 2018, 7:45 pm
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి తనను తీవ్రంగా బాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని అత్యంత సీనియర్ నాయకుల్లో కరుణానిధి ఒకరని మోదీ కొనియాడారు. ఒక గొప్ప మాస్ లీడర్‌, ఫలప్రదమైన ఆలోచనాకర్త, నిష్ణాతుడైన రచయిత, ప్రసిద్ధుడైన వ్యక్తిని మనం కోల్పోయామన్నారు. పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్నే దారబోసిన గొప్ప వ్యక్తి కరుణానిధి అని ప్రధాని ప్రశంసించారు. గతంలో కరుణానిధిని కలిసిన ఫొటోను కూడా ట్వీట్‌లో మోదీ పొందుపరిచారు. కాగా, మోదీ రేపు చెన్నై చేరుకుని కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు.
Samayam Telugu Modi

వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి హాస్పిటల్ చికిత్స పొందుతున్న కరుణానిధి తన 94వ ఏట కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కావేరీ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని మంగళవారం సాయంత్రం కావేరీ హాస్పిటల్ వైద్యులు ప్రకటించగానే చెన్నై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కావేరీ హాస్పిటల్, కరుణానిధి నివాసం వద్దకు ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని తీవ్ర ఆవేదనతో ఎదురుచూశారు. కళైంగర్ మరణ వార్త తెలియగానే ఆయన అభిమానులు బోరున విలపించారు.

మరోవైపు చెన్నైలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కరుణానిధి కుటుంబ సభ్యులు, బంధువులు గోపాలపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. హాస్పిటల్‌లో లాంఛనాలు పూర్తైన తరవాత కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.