యాప్నగరం

Modi Kerala Tour: కేరళలో తొలి వందేభారత్ రైలు ప్రారంభం.. పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

Modi Kerala Tour ప్రదాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ నుంచి తన టూర్‌ను ప్రారంభించి.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 7 నగరాల్లో పర్యటించేలా ప్లాన్ చేశారు. మొదట సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవా నగర్‌లో.. జాతీయ పంచాయతీ రాజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ రూ.17 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. అనంతరం అక్కడ నుంచి కేరళకు చేరుకుని పలు ప్రాజెక్టులు, వాటర్ మెట్రో, వందే భారత్ రైలును ప్రారంభించారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 25 Apr 2023, 4:05 pm

ప్రధానాంశాలు:

  • కోచిలో దేశంలోనే తొలిసారి వాటర్ మెట్రో ప్రాజెక్టు
  • తిరువనంతపురం-కాసరగఢ్ వందేభారత్ రైలు
  • డిజిటల్ సైన్స్ పార్క్‌కు ప్రధాని శంకుస్థాపన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu modi
కేరళలో తొలి వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ -కాసర్‌గడ్ మధ్య 11 జిల్లాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణం సాగుతుంది. అనంతరం తిరువనంతపురం నగరంలోని రూ.3,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అలాగే, దేశంలోనే తొలి వాటర్ మెట్రో రవాణా ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. సహజ వనరులు సమృద్ధిగా ఉండే కేరళలో నీటి వనరులకు కొదవలేదు. దీంతో ఈ రాష్ట్రానికి వాటర్ మెట్రో ఎంతో ఉపయోగపడుతుందని భావించి..ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇది కొచ్చి నగరానికి చాలా ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్ట్ అని అధికారులు చెబుతున్నారు.
వాటర్ మెట్రో ప్రయాణంలో సౌకర్యం, సౌలభ్యం, భద్రత, సమయపాలన, విశ్వసనీయత, పర్యావరణ అనుకూలత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సులభమైన ప్రయాణంతో పాటు ముఖ్యంగా కాలుష్యం ఉండబోదని భావిస్తున్నారు. ఇక్కడ వాటర్ మెట్రో సక్సెస్ అయితే.. అవకాశం ఇతర నగరాల్లో దీన్ని ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ సైన్స్ పార్క్‌కు మోదీ శంకుస్థాపన చేశారు.

కేరళలో రెండు రోజుల పర్యటనలో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం తిరువనంతపురంలో ఘన స్వాగతం లభించింది. తిరువనంతపురం విమానాశ్రయం నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్‌ వరకు ఆయన ప్రయాణం రోడ్‌షో లాగా సాగింది. మోదీ కోసం వేలాది మంది గంటల కొద్దీ రహదారికి ఇరువైపులా నిరీక్షించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు అశ్వికదళం ముందుగా దాటినప్పుడు పూల వర్షం కురిపించారు.


Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.