పాకిస్థాన్కు తప్ప ఇరుగు పొరుగు దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పొరుగు దేశాల పట్ల భారత్ విధానాలు, శాంతి, శ్రేయస్సు గురించి మోదీ మరోసారి వివరించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తప్ప అందరి దేశాధినేతలకు మోదీ ఫోన్చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇరువురు ప్రధానుల ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోలేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. పాక్తో ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండగా, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత మరింత దిగజారాయి.
కశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దుచేసి ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని పాకిస్థాన్ ఆరోపించింది. అంతేకాదు, ఇది ముస్లిం వ్యతిరేక చర్యని, కశ్మీరీల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒకడుగు ముందుకేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనుకాడబోమని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని పదేపదే లెవనెత్తే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
ఇక, కొత్త ఏడాది వేళ తొలుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ.. అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు కూడా అభినందనలు తెలిపారు. అలాగే, భారత్లో బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ సయ్యద్ మౌజీమ్ అలీ ఆకస్మక మరణం పట్ల కూడా మోదీ సంతాపం తెలియజేశారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి బంగ్లాదేశ్ ఆవిర్భవించిన 50 ఏళ్లు పూర్తికావస్తున్నందున దౌత్య సంబంధాలు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నామని, తమ ప్రభుత్వ ప్రాధాన్యత కూడా ఇదేనని మోదీ స్పష్టం చేశారు.
నేపాల్ ప్రధాని కేపీ ఓలితో ఫోన్లో సంభాషించిన ప్రధాని.. 2019లో ఇరు దేశాల సంబంధాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నేపాల్లో చేపట్టిన పలు ప్రాజెక్టులు పూర్తిచేయడానికి అందించిన సహకారం పట్ల కూడా మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేపాల్లోని విరాట్నగర్లో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ త్వరగా ప్రారంభించడానికి ఇరువురూ సముఖత వ్యక్తం చేశారు. భూటాన్ రాజు జగ్మే ఖేసర్ నమగ్యల్ వాంగ్చుక్, ప్రధాని లోటే షేరింగ్, శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్షే, ప్రధాని మహేంద్ర రాజపక్షే, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్లతోనూ ప్రధాని మోదీ సంభాషించారు. వీరిందరికి భారతీయుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పొరుగు దేశాల పట్ల తమ వైఖరిని స్పష్టం చేశారు.
కశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దుచేసి ద్వైపాక్షిక ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని పాకిస్థాన్ ఆరోపించింది. అంతేకాదు, ఇది ముస్లిం వ్యతిరేక చర్యని, కశ్మీరీల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒకడుగు ముందుకేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనుకాడబోమని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని పదేపదే లెవనెత్తే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
ఇక, కొత్త ఏడాది వేళ తొలుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ.. అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు కూడా అభినందనలు తెలిపారు. అలాగే, భారత్లో బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ సయ్యద్ మౌజీమ్ అలీ ఆకస్మక మరణం పట్ల కూడా మోదీ సంతాపం తెలియజేశారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి బంగ్లాదేశ్ ఆవిర్భవించిన 50 ఏళ్లు పూర్తికావస్తున్నందున దౌత్య సంబంధాలు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నామని, తమ ప్రభుత్వ ప్రాధాన్యత కూడా ఇదేనని మోదీ స్పష్టం చేశారు.
నేపాల్ ప్రధాని కేపీ ఓలితో ఫోన్లో సంభాషించిన ప్రధాని.. 2019లో ఇరు దేశాల సంబంధాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నేపాల్లో చేపట్టిన పలు ప్రాజెక్టులు పూర్తిచేయడానికి అందించిన సహకారం పట్ల కూడా మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేపాల్లోని విరాట్నగర్లో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ త్వరగా ప్రారంభించడానికి ఇరువురూ సముఖత వ్యక్తం చేశారు. భూటాన్ రాజు జగ్మే ఖేసర్ నమగ్యల్ వాంగ్చుక్, ప్రధాని లోటే షేరింగ్, శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్షే, ప్రధాని మహేంద్ర రాజపక్షే, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్లతోనూ ప్రధాని మోదీ సంభాషించారు. వీరిందరికి భారతీయుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పొరుగు దేశాల పట్ల తమ వైఖరిని స్పష్టం చేశారు.