యాప్నగరం

యూపీ: వలస కార్మికుల కోసం ఉపాథి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది వలస జీవులు తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

Samayam Telugu 26 Jun 2020, 1:01 pm
‘ఆత్మ నిర్బర్ ఉత్తరప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’ పథకాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఈ రోజున ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. కరోనా వైరస్ కారణంగా ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న వలస కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. లాక్‌డౌన్ తర్వాత 30 లక్షల మంది వలస కార్మికులు యూపీకి చేరుకున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది పడనివారంటూ లేరని, పల్లె నుంచి పట్టణం దాకా అందరూ సవాళ్లను ఎదుర్కొంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు.
Samayam Telugu ఆత్మ నిర్బర్ యూపీ రోజ్‌గార్ అభియాన్
PM Launched Atma Nirbhar UP Abhiyan


కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకూ మాస్క్ ధరించి, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు. వీటిని సక్రమంగా పాటించడం వల్ల కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ఆత్మ నిర్బర్ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణ కలిగించి, మోడల్‌గా నిలుస్తుందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చడానికి ఇది ఒక ఉదాహరణ అని, ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి పథకాలతో ముందుకు వస్తాయని తాను ఆశిస్తున్నాను అని ప్రధాని ఉద్ఘాటించారు.

ప్రపంచంలోని చాలా దేశాల కంటే యూపీ రాష్ట్రం పెద్దదని, కరోనా వైరస్‌పై పోరాటంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చాలా శ్రమిస్తోందని అన్నారు. అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలతో దాదాపు 85వేల మంది ప్రాణాలు దక్కాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ విమానాశ్రయానికి త్వరలోనే అంతర్జాతీయ హోదా లభించనుందని, ముఖ్యంగా పూర్వాంచల్‌లో వాయు మార్గం మరింత బలోపేతమవుతుందన్నారు. బుద్ధుడి భక్తులు యూపీకి రావడం వల్ల ఉద్యోగకల్పన జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు.

గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి ముఖ్యంగా ఉద్యోగ కల్పన కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఉపాధి, అభివృద్ధి పనుల కోసం మొత్తం 25 విభాగాలను గుర్తించినట్టు మోదీ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.