యాప్నగరం

'కిసాన్‌ సమ్మాన్‌ నిధి' ప్రారంభం.. తొలి విడతగా రూ.2వేలు

తొలి విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల నగదు జమ చేయనున్నారు.

Samayam Telugu 24 Feb 2019, 2:10 pm

ప్రధానాంశాలు:

  • గోరఖ్‌పూర్‌లో పథకాన్ని ప్రారంభించిన మోదీ
  • ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక సహా 14 రాష్ట్రాల రైతుల ఖాతాల్లో నగదు జమ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu modi
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రధాన మంత్రి-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం (ఫిబ్రవరి 24) ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా కోట్లాది రైతులకు లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. గతంలో రైతులకు ప్రయోజనాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.
తొలి విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల నగదు జమ చేయనున్నారు. మిగిలిన రూ.4 వేలను కేంద్రం మరో రెండు విడతల్లో కేంద్రం జమ చేయనుంది.
ఈ పథకం కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏటా మూడు విడుతలుగా రూ.6 వేల ఆర్థిక సాయం అందనుంది. ఇందులో భాగంగా తొలి విడత నగదును జమచేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. ఈ పథకం కింద రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర‌ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31 లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్‌ కార్డును జత చేయాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.