యాప్నగరం

ఉక్కు మనిషికి ప్రధాని మోడీ ఘన నివాళి

ఫీడం ఫైటర్, భారత తొలి హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

TNN 31 Oct 2016, 11:46 am
స్వాత్రంత్య సమయయోధుడు, భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉన్న పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఆయనకు పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
Samayam Telugu pm narendra modi paid homage to vallabhbhai patel
ఉక్కు మనిషికి ప్రధాని మోడీ ఘన నివాళి


పటేల్ ద గ్రేట్...

సర్దార్ వల్లభాయ్ పటేల్ ..ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. పటేల్ ను యావత్ భారత జాతి ఉక్కుమనిషిగా గుర్తిస్తోంది. ఆడంబరాలు, అట్టహాసాలకు దూరంగా చెక్కుచెదరని ఉక్కు సంకల్పంతో జాతి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు మన సర్ధార్ వల్లభాయ్ పటేల్. పటేల్ స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్క భారతీయుడూ పునరంకితం కావాలనే ఉద్దేశంతో పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా ‘జాతీయ ఐక్యత దినం’గా జరుపుకొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.