యాప్నగరం

PM Modi ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఎన్డీఏదే అధికారం.. తగ్గని మోదీ పాపులారిటీ: సీ-ఓటర్ సర్వే

సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్-మే నెలల్లో జరగనుండగా.. ప్రధానిగా మళ్లీ మోదీనే ఉండాలని మెజార్టీ జనం కోరుకుంటున్నారని తాజాగా సీ ఓటర్ సర్వేలో వెల్లడయ్యింది. గతం కంటే మెజార్టీ కొంత తగ్గినా ఎన్డీఏకే జనం జై కొడతారని ఆ సర్వే చెప్పడం గమనార్హం. దేశంలో ధరలు, నిరుద్యోగం పెరుగుదల వంటి అంశాలు తీవ్రంగా ఉన్నా మోదీ అంటే 50 శాతానికిపైగా జనం మొగ్గుచూపుతున్నారని చెప్పింది. ఈ సర్వేను ఆరు నెలల పాటు నిర్వహించారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 12 Aug 2022, 6:56 pm

ప్రధానాంశాలు:

  • ప్రధానిగా మోదీనే కోరుకుంటున్న ప్రజలు.
  • ఎన్డీఏదే అధికారమన్న సీ ఓటర్ సర్వే.
  • జేడీయూ వైదొలగడంతో తగ్గనున్న సీట్లు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రధాని నరేంద్ర మోదీ
వచ్చే సాధారణ ఎన్నికలకు దాదాపు రెండేళ్లు ఉండగా.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA) స్వల్ప మెజార్టీతో అధికారం చేపడుతుందని తాజాగా ఓ సర్వేలో (The Mood of Nation) వెల్లడయ్యింది. అయితే, ప్రధానిగా మెజార్టీ జనం మోదీకే (Modi Papularity) పట్టం కట్టారు. ఈ విషయంలో మిగతా నేతలకు అందనంత ఎత్తులో మోదీ ఉన్నారు. ఇండియా టుడే మ్యాగిజైన్-సీ ఓటర్‌తో (India Today- C Voter) కలిసి నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 286 సీట్లు వస్తాయని తేలింది. ఎన్డీఏ నుంచి నితీశ్ కుమార్ పార్టీ (Nitish Kumar) జేడీయూ (JD-U) వైదొలగడంతో గతంలో అంచనా వేసిన 307 సీట్ల కంటే 21 స్థానాలు తగ్గుతాయని పేర్కొంది. ప్రస్తుతం బీజేపీ కూటమికి లోక్‌సభలో 300కిపైగా సభ్యులు మెజార్టీ ఉంది.
‘ది మూడ్ ఆఫ్ నేషన్’ పేరుతో ఫిబ్రవరి-ఆగస్టు మధ్య నిర్వహించిన సర్వేలో 122,016 మంది పాల్గొన్నారు. అయితే, ఈ సర్వేలో ఎక్కువ భాగం ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు వెళ్లకముందు నిర్వహించారు. బిహార్‌ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాఘట్‌బంధన్ 2.0 కూటమిలో భాగస్వామిగా చేరారు.

ఎనిమిదేళ్లకు పైగా అధికారంలో ఉన్నా అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, గత వేసవిలో కోవిడ్-19 రెండో దశలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ప్రధాని మోదీకి ప్రజాదరణ చెక్కుచెదరలేదు. వ్యక్తిగతంగా తన రాజకీయ ప్రత్యర్థుల కంటే పైనే ఉన్నారు. తదుపరి ప్రధానిగా దాదాపు 53 శాతం మంది మోదీని కోరుకుంటుండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి 9 శాతం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి 7 శాతం మంది మద్దతు తెలిపారు.

అయితే, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరుపై 40 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 34 శాతం మంది అధ్వాన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని 23 శాతం మంది కోరుకున్నారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.