యాప్నగరం

ఇవాళ రాత్రికి ప్రధాని మోదీ ప్రసంగం.. అందరిలో ఉత్కంఠ!

మంగళవారం రాత్రి 8 గంటలకు మోదీ జాతిని ఉద్దేశించి కీలక ప్రకటన చేయనున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్‌‌డౌన్ ముగియనుండటంతో ప్రధాని ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.

Samayam Telugu 12 May 2020, 12:44 pm
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు మోదీ ప్రకటన చేయనున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్‌‌డౌన్ ముగియనుండటంతో ప్రధాని ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. ప్రధాని సోమవారం కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిణామాలపై చర్చించారు.. లాక్‌డౌన్ అంశంతో పాటూ కరోనా కేసులపై ఆరా తీశారు.. అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు సీఎంలు కొన్ని సూచనలు చేశారు.
Samayam Telugu ప్రధాని మోదీ


ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మరుసటి రోజే ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. నరేంద్ర మోదీ ఇప్పటి వరకు మూడుసార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.. మూడుసార్లు కీలక ప్రకటన చేశారు. నాలుగో సారి మోదీ ప్రసంగ ఉంటుందని ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయమా.. సడలింపులకు సంబంధించి ఏదైనా చెప్పబోతున్నారా అన్నది అందరిలో చర్చనీయాంశమైంది.

ఇప్పటికే లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించడంతో.. ఆ దిశగా నిర్ణయం ఉంటుందన్నది అనుమానమే. ఆర్థికపరంగా ఏవైనా ప్రకటన చేస్తారా.. ప్యాకేజీకి ఏదైనా ఛాన్స్ ఉందా.. రాష్ట్రాలకు ఏవైనా ఊరట కల్పిస్తారా అనే చర్చ మొదలైంది. రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగంపై అందరూ ఎదురు చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.