యాప్నగరం

ప్రధాని మోదీ 'బర్త్ డే స్పెషల్' లడ్డూ.. ఎన్ని కేజీలో తెలుసా

ప్రధాని మోదీ బర్త్ డే స్పెషల్.. భారీ లడ్డూను తయారు చేసిన స్వచ్ఛంద సంస్థ.. ఎన్ని కేజీలంటే..

Samayam Telugu 17 Sep 2018, 5:58 pm
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం 68వ ఏట అడుగు పెట్టారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు వేడుకుల్ని, అలాగే సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అంతేకాదు బర్త్ డే స్పెషల్‌గా ఓ భారీ లడ్డూని కూడా సిద్ధం చేశారు. సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో.. ఈ 568 కేజీల లడ్డూని కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఆవిష్కరించారు. సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మోదీ పుట్టిన రోజును స్వచ్ఛతా దివస్‌గా నిర్వహిస్తోంది.
Samayam Telugu Modi Birth Day


ప్రధాని పుట్టిన రోజు నాడు స్వచ్ఛతా దివస్‌ను నిర్వహించడం.. వినూత్న కార్యక్రమాలను నిర్వహించడంపై ఈ సంస్థను కేంద్రమంత్రులు ప్రశంసించారు. గత నాలుగేళ్లలో దేశంలో పారిశుద్ధ్యం చాలా మెరుగుపడిందని కేంద్రమంత్రి జవదేకర్ అన్నారు. స్వచ్ఛత ప్రచారంలో భాగంగా 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని.. నాలుగున్నర లక్షల గ్రామాలు బహిరంగ మలవిసర్జనరహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయన్నారు. పారిశుద్ధ్యం ఓ ఉద్యమంలా సాగిందన్నారు మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.