పాకిస్థానీ ఆర్టిస్టుల నిషేధంపై నడుస్తున్న వివాదంలో బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కాశ్యప్ కూడా కాలుమోపారు. పాకిస్థానీ నటులతో చిత్రాలు తీస్తున్న దర్శకులు, చిత్ర నిర్మాతలను టార్గెట్ చేయడాన్ని అనురాగ్ కాశ్యప్ తప్పుపట్టారు. పాకిస్థానీ నటులతో చిత్రాలు నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న అంశాన్ని ఎత్తిచూపుతూ, ఈ వివాదంలోకి ప్రధాని నరేంద్రమోడీని కూడా లాగారు. గత ఏడాది మోడి ఆకస్మికంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇలా చేసినందుకు మోడీ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన తన ట్విట్టరు ఖాతా ద్వారా డిమాండ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున నెటిజన్లు విరుచుకుపడ్డారు. తరువాత కూడా కాశ్యప్ తన కామెంట్లకు కట్టుబడే ఉంటానని స్పష్టం చేశారు
పాక్ వెళ్లినందుకు మోడీ క్షమాపణ చెప్పాలి
పాకిస్థానీ నటులతో చిత్రాలు తీస్తున్న దర్శకులు, చిత్ర నిర్మాతలను టార్గెట్ చేయడాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కాశ్యప్ తప్పుపట్టారు
TNN 17 Oct 2016, 3:15 am