యాప్నగరం

23న 'ఆయుష్మాన్ భారత్' ప్రారంభం!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది.

Samayam Telugu 8 Sep 2018, 3:41 pm
ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమం సెప్టెంబరు 23న ప్రారంభంకానుంది. ప్రధాని నరేంద్రమోదీ జార్ఖండ్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కోడర్మాలో మెడికల్ కాలేజీకి, చాయ్ బాసాలో కేన్సర్ ఆస్పత్రికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్ నుంచి ప్రారంభించడం తమకు గర్వకారణమని జార్ఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతోపాటు దేశ ప్రజలందరూ.. ఈ చారిత్రక సందర్భం కోసం ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Samayam Telugu ayushman-bharat


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 10 కోట్ల కుటుంబాలకు (50 కోట్ల మంది) ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చొరవ అద్భుతమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని.. ప్రధాని చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనమని కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.