యాప్నగరం

ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ

భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.

Samayam Telugu 15 Aug 2016, 10:50 am
భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఎగురవేశారు. త్రివిధ దళాలు తమ గౌరవ వందనాన్ని మోడీకి సమర్పించాయి. స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా జనం ఎర్రకోటకు తరలివచ్చారు. వందల సంఖ్యలు స్కూలు పిల్లలు పాల్గొన్నారు. వీఐపీలు, వీవీఐపీలు ఎంతో మంది ఎర్రకోటలో వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. జెండా ఎగురవేయడానికి ముందు రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి మోడీ నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు వచ్చారు. ఎర్రకోటలో భారీ భద్రతా ఏర్పాట్టు చేశారు అధికారులు. దాదాపు 7000 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు.
Samayam Telugu pm unfurls the flag at the ramparts of red fort
ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.