ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లు ఆర్పి, గుమ్మం ముందు దివ్వెలు వెలగించి, కరోనా వైరస్పై పోరాటానికి సంకల్పం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రకటనతో కేంద్ర విద్యుత్ శాఖ అప్రమత్తమయ్యింది. దేశవ్యాప్తంగా ఒక్కసారి విద్యుత్ లైట్లను ఆర్పేస్తే గ్రిడ్ కుప్పకూలకుండా నిరోధించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించింది. విద్యుత్ను ఒక క్రమ పద్దతిలో సరఫరాను చేస్తూ గ్రిడ్ స్థిరత్వాన్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నియంత్రిస్తుంది.
విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటే ఆకస్మికంగా గ్రిడ్ కుప్పకూలుతుంది. ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆపితే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరెంట్ వినియోగం తగ్గిపోయి గ్రిడ్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)తో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శనివారం చర్చించారని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.
పవర్ గ్రిడ్ సమగ్ర కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో) అధీనంలో సాగుతాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ను సమర్థవంతంగా, సురక్షితమైన రీతిలో సరఫరా చేస్తుంది.మొత్తం ఐదు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు, నేషనల్ లోడ్ డెస్పాచ్ సెంటర్తో అనుసంధానమై ఉంటాయి. తద్వారా బ్లాక్అవుట్ సమయంలో డిమాండ్ అకస్మాత్తుగా పడిపోయినా గ్రిడ్ ఫ్రీక్వెన్సీ సాధారణంగా ఉంటుంది.
గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైతే విద్యుత్ షెడ్యూల్లో మార్పులకు ఉత్పత్తి సంస్థలను సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం కేంద్రం సూచనలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా ఎన్టీపీసీ లాంటి కేంద్రం ప్రభుత్వ సంస్థలు గ్యాస్ ఆధారిత కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడం, ప్రారంభించడం సర్వసాధారణం. అయితే, విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతే తలెత్తే పరిణామాల గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ ఆకస్మికంగా తగ్గడానికి గ్రిడ్ ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నారని పీజీసీఐఎల్ అధికారులు తెలిపారు.
వాస్తవానికి దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా సరాసరి విద్యుత్ వినియోగం 20 శాతం కంటే తక్కువగా ఉంది.. కాబట్టి, జాతీయ, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు ఇప్పటికే తక్కువ డిమాండ్ ఉన్నందున ఏప్రిల్ 5 న మరింత పడిపోయినా ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం... ఈ నెల 2న దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 1,25,817 మెగా వాట్స్ కాగా, గతేడాది ఇదే రోజున 1,68,326 మెగా వాట్స్గా ఉంది. దేశంలో 50 హెర్జ్ల సామర్థ్యంతో ఏరియా సింక్రోనస్ గ్రిడ్తో అనుసంధానించబడి ఉంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనుమతించి పరిధి 49.95-50.05 హెర్జ్లు. ఇది జాతీయ, ప్రాంతీయ కేంద్రాల ద్వారా సరఫరాను నియంత్రిస్తుంది.
ఇప్పటికే, అన్ని పారిశ్రామిక, వాణిజ్య వినియోగం నిలిచిపోయినందున.. గ్రిడ్లో దేశీయ, అవసరమైన సేవలకు మాత్రమే విద్యుత్ వినియోగిస్తున్నారు. క్రియాశీల లైటింగ్ లోడ్ మొత్తం లోడ్ కంటే 40 శాతం కన్నా తక్కువ కాబట్టి, లైట్లను ఆకస్మికంగా ఆఫ్ చేయడం వల్ల విద్యుత్తు కుప్పకూలిపోవచ్చు కాబట్టి, ఫ్రిజ్లు, ఏసీలు ఆన్లో ఉంచమని నిపుణులు సూచిస్తున్నారు. గ్రిడ్ కూలిపోతే కరోనా రోగులకు చికిత్స చేస్తున్న అన్ని హాస్పిటల్స్ విద్యుత్ సరఫరా కొరత ఎదుర్కొంటాయని చెబుతున్నారు.
దేశంలో అన్ని రంగాల విద్యుత్ డిమాండులో గృహ వినియోగం కేవలం 20-25% మాత్రమే...ఇందులో ఎక్కువ భాగం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, గీజర్లు, వాషింగ్ మెషిన్లు, కంప్యూటర్లు, టీవీలు...వీటి వినియోగమే ఉంటుంది. కేవలం లైట్ల వినియోగం మొత్తం విద్యుత్ వినియోగంలో 5-10% కూడా ఉండదు. ఇందులో వీధి దీపాల వినియోగం తీస్తే లైట్ల వినియోగం మరింత తక్కువగా ఉంటుంది. రాత్రి 11 గంటల తరువాత సాధారణ రోజుల్లో కూడా ఎక్కడా లైటింగ్ లోడ్ ఉండదు.
విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటే ఆకస్మికంగా గ్రిడ్ కుప్పకూలుతుంది. ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆపితే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరెంట్ వినియోగం తగ్గిపోయి గ్రిడ్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)తో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శనివారం చర్చించారని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.
పవర్ గ్రిడ్ సమగ్ర కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో) అధీనంలో సాగుతాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ను సమర్థవంతంగా, సురక్షితమైన రీతిలో సరఫరా చేస్తుంది.మొత్తం ఐదు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు, నేషనల్ లోడ్ డెస్పాచ్ సెంటర్తో అనుసంధానమై ఉంటాయి. తద్వారా బ్లాక్అవుట్ సమయంలో డిమాండ్ అకస్మాత్తుగా పడిపోయినా గ్రిడ్ ఫ్రీక్వెన్సీ సాధారణంగా ఉంటుంది.
గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైతే విద్యుత్ షెడ్యూల్లో మార్పులకు ఉత్పత్తి సంస్థలను సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం కేంద్రం సూచనలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా ఎన్టీపీసీ లాంటి కేంద్రం ప్రభుత్వ సంస్థలు గ్యాస్ ఆధారిత కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడం, ప్రారంభించడం సర్వసాధారణం. అయితే, విద్యుత్ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతే తలెత్తే పరిణామాల గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ ఆకస్మికంగా తగ్గడానికి గ్రిడ్ ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నారని పీజీసీఐఎల్ అధికారులు తెలిపారు.
వాస్తవానికి దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా సరాసరి విద్యుత్ వినియోగం 20 శాతం కంటే తక్కువగా ఉంది.. కాబట్టి, జాతీయ, ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు ఇప్పటికే తక్కువ డిమాండ్ ఉన్నందున ఏప్రిల్ 5 న మరింత పడిపోయినా ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం... ఈ నెల 2న దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 1,25,817 మెగా వాట్స్ కాగా, గతేడాది ఇదే రోజున 1,68,326 మెగా వాట్స్గా ఉంది. దేశంలో 50 హెర్జ్ల సామర్థ్యంతో ఏరియా సింక్రోనస్ గ్రిడ్తో అనుసంధానించబడి ఉంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనుమతించి పరిధి 49.95-50.05 హెర్జ్లు. ఇది జాతీయ, ప్రాంతీయ కేంద్రాల ద్వారా సరఫరాను నియంత్రిస్తుంది.
ఇప్పటికే, అన్ని పారిశ్రామిక, వాణిజ్య వినియోగం నిలిచిపోయినందున.. గ్రిడ్లో దేశీయ, అవసరమైన సేవలకు మాత్రమే విద్యుత్ వినియోగిస్తున్నారు. క్రియాశీల లైటింగ్ లోడ్ మొత్తం లోడ్ కంటే 40 శాతం కన్నా తక్కువ కాబట్టి, లైట్లను ఆకస్మికంగా ఆఫ్ చేయడం వల్ల విద్యుత్తు కుప్పకూలిపోవచ్చు కాబట్టి, ఫ్రిజ్లు, ఏసీలు ఆన్లో ఉంచమని నిపుణులు సూచిస్తున్నారు. గ్రిడ్ కూలిపోతే కరోనా రోగులకు చికిత్స చేస్తున్న అన్ని హాస్పిటల్స్ విద్యుత్ సరఫరా కొరత ఎదుర్కొంటాయని చెబుతున్నారు.
దేశంలో అన్ని రంగాల విద్యుత్ డిమాండులో గృహ వినియోగం కేవలం 20-25% మాత్రమే...ఇందులో ఎక్కువ భాగం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, గీజర్లు, వాషింగ్ మెషిన్లు, కంప్యూటర్లు, టీవీలు...వీటి వినియోగమే ఉంటుంది. కేవలం లైట్ల వినియోగం మొత్తం విద్యుత్ వినియోగంలో 5-10% కూడా ఉండదు. ఇందులో వీధి దీపాల వినియోగం తీస్తే లైట్ల వినియోగం మరింత తక్కువగా ఉంటుంది. రాత్రి 11 గంటల తరువాత సాధారణ రోజుల్లో కూడా ఎక్కడా లైటింగ్ లోడ్ ఉండదు.