పోకెమాన్ గో మొబైల్ గేమ్ హిందువులు, జైన మతస్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని గుజరాత్ హైకోర్ట్ అభిప్రాయపడింది. ఈ మొబైల్ గేమ్ వల్ల దేవాలయాల పవిత్రత దెబ్బతింటోందని అలయ్ దావే అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషనును కోర్టు విచారణకు స్వీకరించింది. పోకెమాన్ ఆడుతూ మొబైల్ గేమర్లు పాయింట్ల కోసం దేవాలయాల్లోకి ప్రవేశిస్తున్నారని పిటీషనర్ చెప్పారు. పాయింట్లు గెలుచుకున్న వ్యక్తులకు గుడ్లు బహుమతిగా వస్తాయన్నారు. ఈ గుడ్లను మొబైల్లోని కల్పనా ప్రపంచంలోనే పంచిపెడుతున్నారని సరిపుచ్చుకోవడానికి లేదని, అహింసను నమ్మే హైందవ, జైన మతాలు శాకాహారాన్ని భుజించమని బోధిస్తాయని, అలాంటి మతాలయాల్లో గుడ్లను బహుమతిగా ఇవ్వడం ఏ రూపంలో అయినా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశమని దావే కోర్టుకు తెలుపగా, ధర్మాసనం దానితో ఏకీభవించింది.
అంతేకాకుండా, ఈ గేమును ఆడుతూ ప్రమాదాల బారిన పడుతున్న వ్యక్తుల గురించి కూడా పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ గేమ్ ఆడేవాళ్ల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వమని కోరారు. ఈ మేరకు హైకోర్ట్ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వంతో పాటు గేమ్ రూపకర్తయిన నియాంటిక్ ఐఎన్సి సంస్థకు నోటీసులు జారీచేసింది.
అంతేకాకుండా, ఈ గేమును ఆడుతూ ప్రమాదాల బారిన పడుతున్న వ్యక్తుల గురించి కూడా పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ గేమ్ ఆడేవాళ్ల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వమని కోరారు. ఈ మేరకు హైకోర్ట్ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వంతో పాటు గేమ్ రూపకర్తయిన నియాంటిక్ ఐఎన్సి సంస్థకు నోటీసులు జారీచేసింది.