యాప్నగరం

హైటెన్షన్ వైర్లను తాకిన పోల్.. 8 మంది కూలీలు మృతి

Pole fell on Electric wire: కరెంట్ పోల్ పాతుతుండగా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ పోల్ ఓ హైటెన్షన్ వైరుపై పడిపోవడంతో విద్యుత్ ప్రసారమై 8 మంది కూలీలు కరెంట్ షాక్‌కు గురయ్యారు. అక్కడికక్కడే మృతి చెందారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 29 May 2023, 6:57 pm
కరెంట్ పోల్ ఏర్పాటు చేస్తుండగా అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ హై టెన్షన్ వైర్ల మీద పడిపోయింది. విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్‌కు గురై 8 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా నిశ్చిత్‌పూర్‌లో సోమవారం (మే 29) చోటు చేసుకుంది. 25 వేల వోల్టుల విద్యుత్ ప్రసారమయ్యే హైటెన్షన్ వైర్లపై పోల్ పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Pole (Representational Image)
ప్రతీకాత్మక చిత్రం


హౌరా - న్యూ ఢిల్లీ రైల్వే మార్గంలో ధన్‌బాద్, గోమో మధ్య నిశ్చిత్‌పూర్ రైల్వే గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘటన కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.