యాప్నగరం

ప్రయాణికుడిని చంపేసిన డ్రైవర్, కండక్టర్

బస్సును చిన్న పాయింట్ల దగ్గర ఆపుతున్నారేంటీ? అని అడగడమే ఆ ప్రయాణికుడు చేసిన పాపమైంది.

TNN 14 May 2017, 9:52 am
బస్సును చిన్న పాయింట్ల దగ్గర ఆపుతున్నారేంటీ? అని అడగడమే ఆ ప్రయాణికుడు చేసిన పాపమైంది. డ్రైవర్, కండక్టర్ రెచ్చిపోయి ఆ ప్రయాణికుడిని చితక్కొట్టారు. దెబ్బలు తాళలేక మరణించాడు బాధితుడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. శుక్రవారం రాత్రి రాజా అనే వ్యక్తి చెన్నై వెళుతున్న లగ్జరీ బస్సు ఎక్కాడు. అరవై రూపాయలిచ్చి టిక్కెట్ తీసుకున్నాడు. బస్సును డ్రైవర్, కండక్టర్ కలిసి అనుమతిలేని బస్టాపుల్లో కూడా ఆపుతూ మెల్లగా తీసుకెళుతున్నారు. దీంతో రాజా పాయింట్ టూ పాయింట్ లగ్జరీ బస్సును అన్ని బస్టాపులో ఎందుకు ఆపుతున్నారని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రశ్నించాడు.
Samayam Telugu police arrest luxury bus driver conductor over death of passenger
ప్రయాణికుడిని చంపేసిన డ్రైవర్, కండక్టర్


అతనితో డ్రైవర్, కండక్టర్ గొడవ పెట్టుకున్నారు. మాట మాట పెరిగి చేతల దాకా వెళ్లింది. డ్రైవర్, కండక్టర్ రాజాను కిందపడేసి కాళ్లతో ఇష్టానుసారంగా తన్నారు. అనంతరం బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రాజా అనే వ్యక్తి బస్సులో తాగి గొడవ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. రాజా నడవలేని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ వద్దే కుప్పకూలిపోయాడు. కాసేపట్లోనే ప్రాణాలు వదిలాడు. పోలీసులు డ్రైవర్, కండక్టర్ లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.