యాప్నగరం

కర్ణన్ కోసం.. పోలీసుల తిప్పలు!

పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ దేశం దాటి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది..

TNN 11 May 2017, 9:00 pm
పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ దేశం దాటి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కర్ణన్ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయి ఉంటారని ఆయనకు అత్యంత సన్నిహితుడు, న్యాయ సలహాదారు పీటర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. కోర్టు ధిక్కారం విషయంలో జస్టిస్‌ కర్ణన్‌ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మే 9న ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆయణ్ని వెంటనే అరెస్టు చేసి, శిక్ష అమలు చేయాలని కోల్‌కతా పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. జస్టిస్‌ కర్ణన్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తూ.. ముప్పుతిప్పలు పడుతున్నారు.
Samayam Telugu police from 3 states hunt for justice karnan
కర్ణన్ కోసం.. పోలీసుల తిప్పలు!


కోల్‌కతా పోలీసులు అతణ్ని జస్టిస్‌ కర్ణన్‌ను అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి వెళ్లగా.. అప్పటికే ఆయన చెన్నైకి వెళ్లినట్లు తెలిసింది. ఆయణ్ని వెతుక్కుంటూ.. చెన్నైలోని అతిథి గృహానికి చేరుకున్న పోలీసులకు అక్కడా నిరాశే ఎదురైంది. ఆయన అక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు. అంతే కాకుండా.. అతిథి గృహానికి డబ్బులు కూడా చెల్లించలేదట. అక్కడి నుంచి శ్రీశైలం వస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కానీ, బుధవారం రాత్రి వరకూ ఎదురుచూసినా కర్ణన్‌ ఆచూకీ తెలియలేదు.

కర్ణన్‌ ఇవాళ ఉదయాన్నే భారత సరిహద్దు దాటి ఉండొచ్చని భావిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా బంగ్లాదేశ్‌ లేదా నేపాల్‌ వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. రోడ్డు మార్గం ద్వారా నేపాల్‌ లేదా బంగ్లాదేశ్‌ వెళ్లాలంటే కనీసం ఒక రోజు పడుతుంది. కాబట్టి అసలు కర్ణన్‌ నిజంగా దేశం విడిచి వెళ్లిపోయాడా.. లేదా పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఇలా చేస్తున్నారా అనే అనుమానాలున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆయణ్ని హైకోర్టు జడ్జిగా తిరిగి నియమిస్తేనే.. ఆయన బయటకి వచ్చే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.