యాప్నగరం

‘మిస్సింగ్’ఎమ్మెల్యేలను కలిసిన పోలీసులు

మూడు రోజులుగా శశికళ ‘నిర్బంధం’లో ఉన్న అన్నాడీఎంకే 120 మంది ఎమ్మెల్యేలను పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం కలసింది.

TNN 11 Feb 2017, 12:11 pm
మూడు రోజులుగా శశికళ ‘నిర్బంధం’లో ఉన్న అన్నాడీఎంకే 120 మంది ఎమ్మెల్యేలను పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం కలసింది. శశికళ ఎమ్మెల్యేలను బంధించారని అపద్ధర్మ సీఎం ఓ పన్నీర్ సెల్వం గవర్నర్ కు విన్నవించారు...మిస్సింగ్ ఎమ్మెల్యేల జాడ కోసం మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ‘కనిపించకుండా’ పోయిన ఎమ్మెల్యే జాగ గురించి నివేదిక సమర్పించాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో...శనివారం ఉదయం 6.30గంటలకు కువతూర్ రిసార్టులో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అధికారులు కలిశారు.
Samayam Telugu police revenue officials conducting inquiries with aiadmk legislators staying in resort
‘మిస్సింగ్’ఎమ్మెల్యేలను కలిసిన పోలీసులు


రిసార్టులో ఉంటున్న ఎమ్మెల్యే ఇష్టపూర్వకంగానే సేదతీరుతున్నారా? లేదా ఎవరైనా తమను బంధించారా? అనే అంశంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. తమను ఎవరూ నిర్భందించలేదని చెబితే గనుక రాతపూర్వకంగా రాసివ్వడంటూ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేలను కోరారు.

అటు ఉదయం కువతూర్ రిసార్ట్ దగ్గర నుంచి రిపోర్ట్ చేస్తున్న పలు మీడియా సంస్థల ప్రతినిధులపై శశికళ వర్గీయులు రాళ్లు రువ్వారు. ఉదయం కాసేపు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరం నెలకొంది.

ఓపీఎస్ చిన్నమ్మపై తిరుగుబాటు చేయడంతో ఆమె క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.