యాప్నగరం

పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం

త్వరలో ఎన్నికలు జరుపుకోనున్న పంజాబ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

TNN 11 Nov 2016, 3:03 pm
త్వరలో ఎన్నికలు జరుపుకోనున్న పంజాబ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సట్లేజ్-యమునా నది లింక్ కెనాల్ వివాదానికి సంబంధించిన కేసులో హర్యానా రాష్ట్రానికి అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువడటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 42మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ మేరకు వారు తమ రాజీనామా లేఖలను రాష్ట్ర శాసన సభ కార్యదర్శికి శుక్రవారం అందచేశారు. మరోవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ కూడా సుప్రీం తీర్పునకు నిరసనగా తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Samayam Telugu political crisis in punjab
పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం


2004లో పంజాబ్ అసెంబ్లీ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ రాష్ట్రాలతో జరిపే నీటి పంపకాల విషయంలో పంజాబ్ తన అభీష్టం ప్రకారం ఎలా కావాలంటే అలా వ్యవహరించవచ్చు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు గురువారం తీర్పు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆందోళనలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.