తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అంకెలాటలో ఒకరిపై మరొకరు ఎత్తులపై ఎత్తులు వేసుకుంటూ పావులు కదుపుతున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. తనకు 128 ఎమ్మేల్యేల మద్దతు ఉందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు గవర్నర్ను కలసినవారిలో సెంగొట్టియన్ కూడా ఉన్నారు. మరోవైపు పన్నీర్సెల్వం వర్గానికి చెందిన మైత్రేయన్, పాండ్యన్ కూడా మరికొద్దిసేపట్లో గవర్నర్ను కలవనున్నారు.
పోలీసులు శశికళను తరలించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఖైదీలను తరలించే వ్యాన్ను సిద్ధం చేస్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం శశికళను బెంగళూరుకు తరలించనున్నారు. కాగా కోర్టులో లొంగిపోవడానికి 4 వారాల గడువు కావాలంటూ శశికళ పిటిషన్ వేశారు.
డీఎంకే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు దిశగా గవర్నర్ త్వరగా నిర్ణయం తీససుకోవాలని విజ్ఞప్తి చేశారు. "20 ఏళ్ల కిందటి కేసుకు ఇవాళ తీర్పు వెలువడింది. జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ను దోషులుగా తేల్చారు. అవినీతిపరులకు ఈ తీర్పు ఓ గుణపాఠం లాంటిది. ఈ నేపథ్యంలో గవర్నర్ సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసం త్వరగా నిర్ణయం తీసుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు.
పోలీసులు శశికళను తరలించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఖైదీలను తరలించే వ్యాన్ను సిద్ధం చేస్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం శశికళను బెంగళూరుకు తరలించనున్నారు. కాగా కోర్టులో లొంగిపోవడానికి 4 వారాల గడువు కావాలంటూ శశికళ పిటిషన్ వేశారు.
డీఎంకే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు దిశగా గవర్నర్ త్వరగా నిర్ణయం తీససుకోవాలని విజ్ఞప్తి చేశారు. "20 ఏళ్ల కిందటి కేసుకు ఇవాళ తీర్పు వెలువడింది. జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ను దోషులుగా తేల్చారు. అవినీతిపరులకు ఈ తీర్పు ఓ గుణపాఠం లాంటిది. ఈ నేపథ్యంలో గవర్నర్ సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసం త్వరగా నిర్ణయం తీసుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు.