యాప్నగరం

మహిళా నేతపై భర్త, మామ అత్యాచారం.. కేసు నమోదు!

భర్త, మామలు తనను వరకట్నం కోసమే వేధించడమే కాదు, ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారంటూ ఓ మహిళా నేత పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

Samayam Telugu 28 Jul 2018, 1:05 pm
భర్త, మామలు తనను వరకట్నం కోసమే వేధించడమే కాదు, ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారంటూ ఓ మహిళా నేత పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గురుగ్రామ్‌లో గురువారం నాడు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీకి చెందిన ఓ మహిళా నేత (39) భర్త, మామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు ఫిర్యాదుచేసిందని తెలిపారు. గురుగ్రామ్ శివారు ప్రాంతంలో ఉండే తమ ఇంటికి మామ ప్రతి నెలా వచ్చి అనేక సార్లు లైంగికంగా వేధించేవాడని ఆమె తెలిపింది. అంతేకాదు, గత ఫిబ్రవరి 22 న తనపై మామ అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో భర్త ఇంట్లో లేడని, ఆయన పనిమీద బయటకు వెళ్లాడని వెల్లడించింది. తాను స్నానం చేస్తుండటంతో నా గదిలోకి ప్రవేశించి బాత్‌రూమ్‌లో నుంచి వచ్చిన తనను కత్తితో బెదరించి రేప్ చేశాడని వాపోయింది.
Samayam Telugu మహిళా నేత


అంతేకాదు తర్వాత నగ్నంగా ఫోటోలను తీసి దీని గురించి ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని తెలియజేసింది. ఈ విషయం గురించి ఎవరికైనా తెలిస్తే పరువుపోతుందనే భయంతో కొన్నాళ్లు బయటపెట్టలేదని, కానీ కొద్ది రోజుల తర్వాత భర్తకు చెప్పానని పేర్కొంది. తన తండ్రిపై లేనిపోని చెబుతావా అంటూ భర్త కూడా తనను కొట్టి హింసించినట్టు బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది. అతడు కూడా అసహజ లైంగిక చర్యల్లో పాల్గొనాల్సిందిగా తన బలవంతపెట్టాడని, తండ్రీ కొడుకులు ఇద్దరూ వివాహం జరిగినప్పటి నుంచీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని వివరించింది. మహిళా నేత ఫిర్యాదుతో భర్త, మామలపై అత్యాచారం, వరకట్నం వేధింపులు, అసహజ శృంగారం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆరోపణల్లో నిజానిజాలను పరిశీలించి, నిందితులను తర్వలోనే అరెస్ట్ చేస్తామని మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మంజూష తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.