యాప్నగరం

నేతల లెక్కలన్నీ పక్కాగా ఉండాల్సిందే: సుప్రీం కోర్టు

రాజకీయ నేతల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ప్రకటించింది. మనీ పాలిటిక్స్‌కు చెక్ పెడుతూ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలెవరైనా లెక్కలు పక్కాగా చెప్పాల్సిందేనని తేల్చింది. నేతలు వారికి ఆదాయం ఎలా వస్తుందో కచ్చితంగా చెప్పి తీరాలని ఆదేశించింది. అంతేకాదు... లీడర్లతో పాటూ భార్య, పిల్లలు... ఆయనపై ఆధారపడిన వ్యక్తులకు సంబంధించిన ఇన్‌కమ్ సోర్స్ చెప్పాల్సిందే.

TNN 17 Feb 2018, 9:28 am
రాజకీయ నేతల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ప్రకటించింది. మనీ పాలిటిక్స్‌కు చెక్ పెడుతూ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలెవరైనా లెక్కలు పక్కాగా చెప్పాల్సిందేనని తేల్చింది. నేతలు వారికి ఆదాయం ఎలా వస్తుందో కచ్చితంగా చెప్పి తీరాలని ఆదేశించింది. అంతేకాదు... లీడర్లతో పాటూ భార్య, పిల్లలు... ఆయనపై ఆధారపడిన వ్యక్తులకు సంబంధించిన ఇన్‌కమ్ సోర్స్ చెప్పాల్సిందే. అలాగే నేతలు ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించి ఏవైనా కాంట్రాక్ట్‌లు ఉంటే వాటి వివరాలు ఇవ్వాలి. అదే నిబంధన భార్య, వాళ్లపై ఆధారపడినవారికి కూడా వర్తిస్తుంది.
Samayam Telugu poll aspirants must reveal income sources of self kin says supreme
నేతల లెక్కలన్నీ పక్కాగా ఉండాల్సిందే: సుప్రీం కోర్టు



జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. కేంద్రం ఎన్నికల నిబంధనలతో పాటు ఫామ్ 26ను సవరించాలని ఆదేశించింది. అలాగే కొన్ని మార్పులను కూడా సూచించింది. ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తుల వివరాలు ఓటర్లకు తెలియడం వారి ప్రాథమిక హక్కుగా ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే సరైన సమాచారం ఇవ్వకపోయినా... అది అవినీతి కిందికే వస్తుందని తెలిపింది. అలా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ తీర్పుతో ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులకు సంబంధించిన సమాచారం ప్రతి ఓటరుకు తెలియాలనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తపరిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.