యాప్నగరం

పశ్చిమబంగాలో నేడు చివరి దశ పోలింగ్

పశ్చిమబంగా రాష్ట్రంలో గురువారం చివరదశ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడుగంటలకు మొదలైంది.

TNN 5 May 2016, 10:58 am
పశ్చిమబంగా రాష్ట్రంలో గురువారం చివరదశ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడుగంటలకు మొదలైంది. మొత్తం ఆరు దశల్లో ఇక్కడ పోలింగ్ ను నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో దశదశలుగా పోలింగ్ ఏర్పాటు చేశారు. ఆరో దశలో తూర్పు మిడ్నాపూర్, కూచ్ బిహార్ జిల్లాల్లో పాతిక నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 50 వేలమంది భద్రతా సిబ్బందిని బందోబస్తుకు ఏర్పాటు చేశారు. 6,774 పోలింగ్ కేంద్రాల్లో... 58,04,019 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నేడు జరిగే పోలింగ్ లో 170 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
Samayam Telugu polling for sixth phase in west bengal begins
పశ్చిమబంగాలో నేడు చివరి దశ పోలింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.