యాప్నగరం

హోంమంత్రి హెలికాప్టర్ కోసం 20 గ్రామాల్లో విద్యుత్ కట్!

అధికారుల ఓవర్ యాక్షన్‌కు 20 గ్రామాల ప్రజలు శనివారమంతా చిమ్మచీకట్లో గడపాల్సి వచ్చింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెలికాప్టర్ కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 గ్రామాలకు విద్యు్త్తు నిలిపేసి స్వామి భక్తి చాటుకున్నారు.

Samayam Telugu 20 May 2018, 1:04 pm
ధికారుల ఓవర్ యాక్షన్‌కు 20 గ్రామాల ప్రజలు శనివారమంతా చిమ్మచీకట్లో గడపాల్సి వచ్చింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెలికాప్టర్ కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 గ్రామాలకు విద్యు్త్తు నిలిపేసి స్వామి భక్తి చాటుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు విద్యుత్తు కేంద్రాల వద్దకు వెళ్లి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Samayam Telugu 20a


కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్యప్రదేశ్‌ సాత్నాలోని కోఠీనగర్‌లో ఆదివారం స్వాతంత్ర్య సమర యోధుడు ఠాకూర్ రామ్‌నాథ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన హెలికాప్టర్ అక్కడ సురక్షితంగా దిగేందుకు 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆయా గ్రామాల్లో హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉండటంతో హెలికాప్టర్‌ దిగడం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

ఈ మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చారు. చెప్పినట్లుగానే సాయంత్రం 4 గంటలకు విద్యుత్తు నిలిపేశారు. అయితే, దాదాపు 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతతో ఇబ్బందులకు గురవ్వుతున్న ప్రజలకు విద్యుత్ కోత మరింత వేదించింది. రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో, వారంతా విద్యుత్ కేంద్రాలకు వెళ్లి ఆందోళనలు చేశారు. తీవ్ర ఉక్కపోతతో పిల్లలు, పెద్దలు ఇబ్బందిపడుతున్నారని వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని డిమాండు చేశారు. చివరికి ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు తిరిగి విద్యుత్ సరఫరా అందించారు. అయితే, మధ్యప్రదేశ్‌లో వీఐపీల కోసం గ్రామస్థులను వేదించడం ఇదే తొలిసారి కాదు. 2016, ఫిబ్రవరిలో సెహర్ ప్రాంతంలో ప్రధాని మోదీ ర్యాలీ కోసం అధికారులు ఓ రైతుతో గోదుమ పంటను బలవంతంగా కోయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.