యాప్నగరం

ప్రజలను ఎంతకాలం పిచ్చివాళ్లను చేస్తారు?: ప్రకాశ్ రాజ్

కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విలక్షణ నటుడు విలక్షణ నటుడు తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి విరుచుకుపడ్డారు.

Samayam Telugu 8 Jun 2018, 2:50 pm
కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విలక్షణ నటుడు విలక్షణ నటుడు తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలపై విమర్శలు గుప్పించిన ఆయన, నేతల తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కర్ణాటక రాజకీయాలు..!! ఒక పార్టీ బీజేపీ డబ్బు, అధికారంతో లాబీయింగ్‌కు ప్రయత్నించింది... మీరు కాంగ్రెస్/జేడీఎస్ నేతలు మంత్రిత్వ పదవులతో లాబీయింగ్ చేస్తున్నారు... రెండు మార్గాల్లోనూ మీరందరూ మిమ్మల్ని మీరు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారు.. ఎంత కాలం పాటు మీరు ప్రజలను పిచ్చివాళ్లను చేస్తారు? ఇక పరిపాలన ఎప్పుడు ప్రారంభిస్తారు?’ అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు.
Samayam Telugu నటుడు ప్రకాశ్ రాజ్


బల నిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం కూడా ప్రకాశ్ రాజ్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆట మొదలవ్వకుండానే ముగిసిందంటూ యడ్యూరప్ప రాజీనామా, కర్ణాటక రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటకకు కాషాయరంగు అంటుకోలేదు... కానీ రంగులమయంగానే కొనసాగబోతోంది. ఆట మొదలవ్వకుండానే ముగిసింది... 56 గురించి మర్చిపోండి... 55 దగ్గరే ఆగిపోయింది. ప్రియమైన ప్రజలారా మురికి రాజకీయాల కోసం సిద్ధంకండి. అలాగే ప్రజల కోసం నిలబడతాను... పోరాటం కొనసాగుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.