ఎండలు వణికిస్తున్నాయి. అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నవారే ఎండ తీవ్రతకు, వడగాలులకు కుదేలవుతున్నారు. అలాంటి వేళ.. నిండు గర్భిణి అయిన 21 ఏళ్ల ఓ మహిళ 7 కి.మీ. దూరం ఎండలో నడిచింది. ఆస్పత్రికి వెళ్లేందుకు మరో మార్గం లేక, ఆ గిరిజన మహిళ నడకనే నమ్ముకుంది. చివరికి, ఎండదెబ్బకు గురై ప్రాణాలు విడిచింది. హృదయ విదారకమైన ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం (మే 12) చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లా దహను తాలూకాలోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్ (21) ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. నాలుగు రోజుల కిందట ఆమె అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి వెళ్లాలంటే 7 కి.మీ. దూరం ప్రయాణించాల్సిందే. పైగా గ్రామానికి సరైన రాకపోకలు లేవు. దీంతో ఆమె తమ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) వెళ్లేందుకు తమ గ్రామం నుంచి ఎండలో 3.5 కి.మీ. నడిచింది. హైవే వద్దకు చేరుకుని అక్కడ నుంచి ఆటోలో పీహెచ్సీకి వెళ్లింది.
పీహెచ్సీలో వైద్య సిబ్బంది సోనాలికి చికిత్స అందించారు. అనంతరం ఆమె హైవే నుంచి తిరిగి ఇంటికి చేరుకునేందుకు మళ్లీ నడకనే ఆశ్రయించింది. ఈసారి వేసవి తాపం ఎక్కువగా ఉంది. అయినా, ఆ ఎండలో 3.5 కి.మీ. ఎండ దెబ్బకు గురై సాయంత్రం కల్లా తీవ్ర అస్వస్థతకు గురైంది.
కుటుంబసభ్యులు సోనాలిని వెంటనే దుండల్వాడి పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు చికిత్స అందించేందుకు ధైర్యం చేయలేకపోయారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో ఉంది. ఆమెను కాసా సబ్-డివిజనల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అంబులెన్స్లో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కూడా కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
మండే ఎండలో 7 కిలోమీటర్లు నడవడంతోనే సోనాలి పరిస్థితి దిగజారిందని పాల్ఘర్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సంజయ్ బోడాడే తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఆ మహిళకు అప్పటికే రక్తహీనత ఉందని, దీనికి తోడు ఎండదెబ్బకు గురవ్వడంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్య సిబ్బంది తెలిపారు.
Also Read: పిల్లల్ని కనండిరా బాబు, పెళ్లిళ్లు చేసుకోకున్నా సరే.. చైనీయులకు సర్కార్ బంపరాఫర్లు
పీహెచ్సీలో వైద్య సిబ్బంది సోనాలికి చికిత్స అందించారు. అనంతరం ఆమె హైవే నుంచి తిరిగి ఇంటికి చేరుకునేందుకు మళ్లీ నడకనే ఆశ్రయించింది. ఈసారి వేసవి తాపం ఎక్కువగా ఉంది. అయినా, ఆ ఎండలో 3.5 కి.మీ. ఎండ దెబ్బకు గురై సాయంత్రం కల్లా తీవ్ర అస్వస్థతకు గురైంది.
కుటుంబసభ్యులు సోనాలిని వెంటనే దుండల్వాడి పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు చికిత్స అందించేందుకు ధైర్యం చేయలేకపోయారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయిన స్థితిలో ఉంది. ఆమెను కాసా సబ్-డివిజనల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అంబులెన్స్లో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న పిండాన్ని కూడా కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
మండే ఎండలో 7 కిలోమీటర్లు నడవడంతోనే సోనాలి పరిస్థితి దిగజారిందని పాల్ఘర్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సంజయ్ బోడాడే తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఆ మహిళకు అప్పటికే రక్తహీనత ఉందని, దీనికి తోడు ఎండదెబ్బకు గురవ్వడంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్య సిబ్బంది తెలిపారు.
Also Read: పిల్లల్ని కనండిరా బాబు, పెళ్లిళ్లు చేసుకోకున్నా సరే.. చైనీయులకు సర్కార్ బంపరాఫర్లు