యాప్నగరం

రౌడీఇన్స్‌పెక్టర్ తన్నుకు గర్భిణి బలి

రోడ్డు మీద బండి ఆపమన్నా ఆపలేదన్న కోపంతో ఇన్స్‌పెక్టర్ వెంటాడి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని ట్రిచ్చి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

TNN 8 Mar 2018, 4:16 pm
అధికారం అనే మదం ఎక్కిన ఓ ఖాకీ కిరాతకానికి ఓ గర్భిణి బలైంది. తనని లెక్కచేయలేదన్న కావరంతో కాలుతో తన్ని ఆ ఖాకీ 30 ఏళ్ల గర్భిణిని పొట్టన పెట్టుకున్నాడు. రోడ్డు మీద బండి ఆపమన్నా ఆపలేదన్న కోపంతో ఇన్స్‌పెక్టర్ వెంటాడి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని ట్రిచ్చి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తంజాపూరు సమీపంలోని 'పాపనాశనం'కు చెందిన 'రాజా' 'ఉషా' దంపతులు ట్రిచ్చి వచ్చారు. ఇన్స్‌పెక్టర్ 'కామరాజ్' నేతృత్వంలో ట్రిచ్చిలో హెల్మెట్ చెకింగ్ చేస్తున్న పోలీసు బృందం వీరి బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించగా హెల్మెట్ లేకపోవడంతో రాజా వేగం పెంచి రయ్యుమని తప్పించుకున్నాడు.
Samayam Telugu pregnant woman riding pillion dies as cop kicks bike
రౌడీఇన్స్‌పెక్టర్ తన్నుకు గర్భిణి బలి


దీన్ని జీర్ణించుకోలేని ఇన్స్‌పెక్టర్ మరో బైక్ పై వీరిని వెంటాడాడు. దీంతో రాజా మరింత వేగం పెంచాడు. మదమెక్కిన ఖాకీ కూడా వేగం పెంచి రాజా, ఉషాల బైక్‌ను కాలితో బలంగా తన్నాడు. అదుపుతప్పి కిందపడ్డ ఉషా అక్కడిక్కడే ప్రాణాలు వదలగా రాజాకు తీవ్రగాయాలయ్యాయి. ఇది చూసి నలుగురు పోగవడంతో ఇన్స్‌పెక్టర్ కామరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో రాజా ఆసుపత్రి పాలయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్స్‌పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నా అతన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్స్‌పెక్టర్‌ వెంటపడ్డ మాట వాస్తవవే అయినా బైక్‌ను తన్నలేదని బుకాయిస్తున్నారు. అయితే ఇన్స్‌పెక్టర్‌ కాలితో తన్నడాన్ని తాము చూశామని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నా పోలీసులు లెక్కచేయడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.