యాప్నగరం

కోవింద్‌కు ఆ రాష్ట్రంలో ఒక్క ఓటే!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 14 వ రాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్. ఆయన యూపీ నుంచి అత్యధికంగా ఓట్లు సాధించారు.

TNN 20 Jul 2017, 9:02 pm
రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 5,28,876 ఎంపీ ఓట్లలో 3,69,575 ఓట్లు లభించాయి. రాజ్యసభ, లోక్‌సభలోని 746 ఓట్లలో కోవింద్‌కు 522 ఓట్లు దక్కాయి. ఇక రాష్ట్రాల వారిగా ఎమ్మెల్యే ఓట్లలో అత్యధికంగా యూపీ నుంచి 69,680 లభించగా, అత్యల్పంగా మిజోరాం నుంచి ఆరుగురు అభ్యర్థులు అనుకూలంగా ఓటేసినా ఇక్కడ విలువ ప్రకారం 48 ఓట్లు లభించాయి. యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు 1,59,309 ఎంపీ ఓట్లు లభించగా, ఎమ్మెల్యేల ఓట్లలో అత్యధికంగా పశ్చిమ్ బెంగాల్ నుంచి 41,233 లభించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికే వేశారు. ఇక్కడ కాంగ్రెస్ ఒక్క ఓటుకు సంపాదించుకోలేదు.
Samayam Telugu president electionsramanath kovind got highest votes in wich state
కోవింద్‌కు ఆ రాష్ట్రంలో ఒక్క ఓటే!


తెలంగాణలో కోవింద్‌ 12,804, మీరాకుమార్‌కు 2,640 ఓట్లు దక్కించుకున్నారు. ఏపీలో పోలైన 174 ఎమ్మెల్యే ఓట్లలో 3 ఓట్లు చెల్లుబాటు కాలేదు. తెలంగాణలో మాత్రం 100 శాతం చెల్లుబాటు అయ్యాయి. కేరళలో మాత్రం బీజేపీ అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే సాధించారు. ఇదే అత్యల్పం. గోవా, గుజరాత్‌లో మాత్రం బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో తమ బలం కంటే మెజార్టీ లభించింది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యేల ఓట్లు మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి మీరాకుమార్‌కు పడ్డాయి. బీహార్‌లోనూ ఎన్డీఏ అభ్యర్థికి ఆధిక్యం లభించింది. ఈ రాష్ట్రంలో 130 మంది ఎమ్మెల్యేలు కోవింద్‌కు అనుకూలంగా ఓటేస్తే, మీరాకుమార్‌కు 109 ఓట్లు మాత్రమే ఓటేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.