యాప్నగరం

Nirbhaya Case: నిర్భయ దోషి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో 14 రోజుల తర్వాత నిర్భయ దోషులను ఉరి తీయడానికి వీలవుతుంది.

Samayam Telugu 1 Feb 2020, 11:08 am
నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. జనవరి 29న అతడు క్షమాభిక్ష పిటిషన్‌ కోసం దాఖలు చేసుకోగా.. శనివారం ఉదయం రాష్ట్రపతి దాన్ని తిరస్కరించారు. దీంతో నలుగురు దోషుల ఉరికి మార్గం సుగమమైంది. వాస్తవానికి నేటి (శనివారం) ఉదయం ఆరు గంటలకే నలుగురు దోషులను ఉరి తీయాల్సింది. కానీ రాష్ట్రపతి వద్ద వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో.. ఉరి అమలుపై స్టే విధించారు. తుదపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నిర్భయ దోషులను ఉరి తీయొద్దని ఢిల్లీ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu vinay sharma


వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో.. ఉరిని వాయిదా వేయాలని కోరుతూ నిర్భయ దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురు, శుక్రవారాల్లో ఈ పిటిషన్‌‌ను విచారించిన న్యాయస్థానం.. నిర్భయ దోషుల ఉరిని వాయిదా వేసింది. ఒక్కరి క్షమాభిక్ష పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని, మిగతా ముగ్గుర్నీ ఉరి తీయొచ్చని తిహార్ జైలు అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. కాగా జైలు నిబంధనల ప్రకారం ఒకే కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న దోషులందర్నీ ఒకేసారి ఉరితీయాలని దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు.

వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రద్దు కావడంతో నలుగురు దోషులను ఫిబ్రవరి 15న లేదా ఆ తర్వాత ఉరి తీయొచ్చు. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన 14 రోజుల వరకు ఉరి తీయడం సాధ్యపడదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.