యాప్నగరం

కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి కోవింద్

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధికి పరామర్శలు కొనసాగుతున్నాయి. చెన్నై కావేరీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన్ను.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు.

Samayam Telugu 5 Aug 2018, 4:33 pm
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధికి పరామర్శలు కొనసాగుతున్నాయి. చెన్నై కావేరీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన్ను.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. ముందుగా ఐసీయూలో చికిత్సపొందుతున్న కరుణ ఆరోగ్యంపై ఆరా తీసి.. తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్‌ను కలిశారు. కరుణానిధికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కరుణ ఆరోగ్యం మెరుగయ్యిందని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కోవింద్. రాష్ట్రపతి వెంట తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కూడా ఆస్పత్రికి వెళ్లారు.
Samayam Telugu President


గతవారం అనారోగ్యంతో కరుణానిధి అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. ఆయనకు రక్తపోటు రావడంతో.. ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తంకాడంతో.. వారు భారీగా కావేరీ ఆస్పత్రి దగ్గరకు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే కుటుంబ సభ్యులు కూడా అక్కడి చేరుకోవడంతో హైడ్రామా నడిచింది. సీనియర్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో వైద్యం అందించడంతో ఆయన మెల్లిగా కోలుకుంటున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.