భారత దేశ ప్రగతి పయనంలో ప్రతీ ఒక్క భారతీయుని హస్తం ఉండాలని దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. సోమవారం నాడు యావత్ జాతి తన 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రణబ్ జాతిని ఉద్దేశించి ఆదివారం నాడు ప్రసంగించారు. నా తోటి భారతీయులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రణబ్ పలు అంశాలను తన ప్రసంగంలో స్పృశించారు. కీలకమైన జీఎస్టీ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది మనదేశ ప్రజాస్వామ్యం పరిపక్వతకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికి తన నమస్సులను అందచేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనే నాలుగు స్థంభాలపై మన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నామన్నారు. శతాబ్దాల క్రితం నాటి అంధ విశ్వాసాలు ఇంకా దేశంలో కనిపిస్తుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రణబ్ ముఖర్జీకీ ఐదవ పంద్రాగస్టు ప్రసంగం.
70వ స్వాతంత్య్ర దినోత్సవం: జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
భారత దేశ ప్రగతి పయనంలో ప్రతీ ఒక్క భారతీయుని హస్తం ఉండాలని దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు.
TNN 14 Aug 2016, 8:36 pm