యాప్నగరం

పద్మ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

ప్రణబ్ ముఖర్జీ పలువురు ప్రముఖులకు మంగళవారం పద్మ అవార్డులు ప్రదానం చేశారు.

TNN 12 Apr 2016, 12:02 pm
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురు ప్రముఖులకు మంగళవారం పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రామోజీరావు, రజనీకాంత్, వాసుదేవ్ కల్ కుంటే ఆత్రే, గిరిజాదేవి, విశ్వనాథ శాంతలకు పద్మవిభూషణ్ అందించారు. సానియా మీర్జా, ఉదిత్ నారాయణ్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రియాంక చోప్రా, స్వామి దయానంత సరస్వతి తదితరులు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. మొత్తం 112 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. గత నెలలో 56 మందికి అవార్డులు ప్రదానం చేశారు. మిగతా వారికి మంగళవారం అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.