యాప్నగరం

ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Delhi: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కుమార్తెతో కలిసి ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Samayam Telugu 3 Mar 2021, 3:56 pm
దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. బుధవారం (మార్చి 3) మధ్యాహ్నం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్‌ రిఫరల్‌ హాస్పిటల్‌లో ఆయన కొవిడ్‌ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
Samayam Telugu రామ్‌నాథ్ కోవింద్
Ram Nath Kovind


వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కృతజ్ఞతలు తెలిపారు. చరిత్రలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన పౌరులందరూ టీకా వేయించుకోవాలని ఆయన కోరారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండో దశ టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. 60 ఏళ్ల పైబడిన వారికి, 45-59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఈ దశలో టీకా వేస్తున్నారు. గత సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ టీకా తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు టీకా‌ వేయించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.