అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడింది. దీంతో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈబీసీల రిజర్వేషన్ల బిల్లుకు శనివారం (జనవరి 12) రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లపై గెజిట్ విడుదలైంది. దీంతో పార్లమెంట్ చరిత్రలో మరో కొత్త చట్టం ఆవిష్కృతమైంది. పార్లమెంట్ చరిత్రలో ఓ బిల్లు ప్రవేశపెట్టిన వారం రోజుల్లోపే చట్ట రూపం దాల్చడం మరో విశేషం. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇటీవల లోక్ సభ, రాజ్య సభ 2/3వ వంతు మెజార్టీతో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం దేశంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న రిజర్వేషన్లన్నీ కలిసి 49.5 శాతం అవుతున్నాయి. ఈ రిజర్వేషన్లకు ఈబీసీ రిజర్వేషన్లు అదనం. అంటే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతం అవుతున్నాయి.
ఈబీసీ రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయనే విషయంలో చట్టంలో స్పష్టత ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారు, ఆర్థిక స్థితిని ఏవిధంగా గణించాలి అనే అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది.
ఈబీసీ రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తిస్తాయి?
ప్రస్తుతం దేశంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న రిజర్వేషన్లన్నీ కలిసి 49.5 శాతం అవుతున్నాయి. ఈ రిజర్వేషన్లకు ఈబీసీ రిజర్వేషన్లు అదనం. అంటే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతం అవుతున్నాయి.
ఈబీసీ రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయనే విషయంలో చట్టంలో స్పష్టత ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారు, ఆర్థిక స్థితిని ఏవిధంగా గణించాలి అనే అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది.
ఈబీసీ రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తిస్తాయి?
- ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, రాజ్పుట్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు తదితర సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి.
- విద్య, ఉద్యోగ రంగాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు.
- వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగిన వారికి ఈబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారికి..
- నాన్-నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 200 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.